మూడవ రోజు (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ "గాయత్రీదేవి"గా సాక్షాత్కరిస్తుంది.
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్ అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్ 💥నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీపురాణం చెబుతోంది. దుష్టశిక్షణ, లోక సంరక్షణ కోసం శక్తిస్వరూపణి ఎత్తిన అవతారాలే నవదుర్గలు. ఆ తొమ్మిది రూపాలను షోడశోపచారాలతో పూజించి ఆరాధించే పర్వదినాలే శరన్నవరాత్రులు. 🍁అమ్మవారి మూడో అవతారం "చంద్రఘంట" 💥 చంద్రఘంట : పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా || శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది.. అందుకే ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు. ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయ ఘంట మోగుతూ ఉంటుంది. 🍁 శరన్నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ "గాయత్రీదేవి"గా సాక్షాత్కరిస్తుంది. 💥 గాయత్రీదేవి ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మక...