Posts

మత్స్యావతార స్వరూప స్తుతి..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి. అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు. 💥 మత్స్యావతార స్వరూప స్తుతి.. తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! #భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.     కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను ద్యన్నయ మూర్త...

ఓం నమో నారాయణాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥                                                     -భగవద్గీత. "భగవద్గీత"లోని ఈ శ్లోకానికి "#చరమశ్లోకము"అని పేరు. ఈ శ్లోకంలో... "శరణాగతుడైన జీవుడేమి చేయాలో " మొదటి చరణం తెల్పితే, రెండవ చరణంలో "భగవంతుడేమి చేస్తాడో" మనకు స్పష్టమవుతుంది.  "సర్వ ధర్మాల్ని త్యజించి నన్నాశ్రయింపుము. 'అహం’ అంటే నేను- భగవానుడను, సర్వజ్ఞుడను. సర్వశక్తుడను అయిన నేను- ‘త్వా’- నిన్ను, అకించనుడవై, అనన్య గతికుడవై నన్నే ఉపాయంగా నమ్మి వున్న నిన్ను- సమస్త పాపాలనుండి విముక్తుణ్ని చేయగలను" అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అర్జునుని శోకం మాన్పుటకు ఈ ‘చరమ శ్లోకాన్ని’ ఉపదేశించాడు. ఈ ఉపదేశం కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళి కోసం శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం. ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!! 💥భావం: సమస్తములైన శాస్త్రాలను ...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 వక్షో నివాస మకరోత్ పరమం విభూతే/ యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్  లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు నాదుడయ్యేనేసి నడప నోపు నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు బుష్పదామకమున బూజ సేసె ! లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకల సద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం. 2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 4. తామస మన్వంతరంలో - భూమి నుండీ, 5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ, 6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ, 7. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. 💥చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో - పూర్వం ఒకసారి "దుర్వాస"...

💥గురు పరంపరకు ఆద్యుడు - దత్తాత్రేయుడు

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏 శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥  💥గురు పరంపరకు ఆద్యుడు - దత్తాత్రేయుడు దత్తాత్రేయుడిని స్మరణకు తెచ్చుకోగానే, మూడు ముఖాలు, ఆరు చేతులు, వెనుక కామధేనువు, ఔదుంబర (మేడి) వృక్షం, తన ముందు నాలుగు శునకాలు గల స్వరూపం మదిలో మెదలుతుంది.  త్రిమూర్తుల ప్రతిరూపం, వారికి ఆధారమైన ప్రజ్ఞానమే దేహంగా, షట్ శాస్త్రాలే చేతులుగా, నాలుగుపాదాలపై నిలిచిన ధర్మమే గోవుగా, అవిద్యను నిర్మూలించే నాలుగు వేదాలే శునకాలుగా, విశ్వశాంతియే ఔదుంబర వృక్షంగా దత్తోపాసకులు భావిస్తారు. దత్తాత్రేయుడే గురుపరంపరకు ఆద్యుడని ఆయన ఉపాసకులు విశ్వసిస్తారు. స్వయంగా తండ్రికి జ్ఞానబోధ చేయడం ద్వారా ఆయన గురుపరంపరకు ఆద్యుడయ్యాడని అంటారు. అనంతర కాలంలో దత్తప్రభువు.. కార్తవీర్యార్జునుడు, దలాదనుడు మొదలైన వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడని దత్తపురాణం చెబుతుంది. 💥స్మరించిన క్షణమే.. స్వామి అమిత కరుణామూర్తి అన్నది దత్త భక్తుల దృఢ నమ్మకం. దత్తాత్రేయుడు స్మర్తృగామి.. అంటే, స్మరించిన వారి చెంతకు తక్షణమే చేరి కష్టాలను తీర్చే భగవానుడు.  వింధ్యాచల ప్రాంతంలో ని...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️ 🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడు విచిత్రమైన మూషికవాహనాన్ని అధిరోహిస్తాడు. వింతైన మోదకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇంతకూ మూషికానికి, మోదకానికి గల ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఏమిటి? 💥ఆదిపూజితుడిగా మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే లంబోదరుడు మూషికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముంది.  వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుక ఇంద్రియ లౌల్యానికి నిదర్శనం.  ఆవిధంగా అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీక అయిన ఎలుకపై సర్వవిద్యాసమన్వితుడైన విఘ్నేశుడు కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు. అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి విఘ్నేశ్వరుడు. 💥మోదకం – అంతరార్థం గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువ...

💥కోట్ల జన్మల పాప రాశులను భస్మం చేసే మహా మహిమాన్వితమైన "శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ" స్తోత్రం.

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 💥కోట్ల జన్మల పాప రాశులను భస్మం చేసే మహా మహిమాన్వితమైన "శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ" స్తోత్రం. శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం.. దీనినే "సుబ్రహ్మణ్యాష్టకం" అని కూడా అంటారు. ప్రతీ రోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని స్మరించడం, సకల శుభకరం. 💥శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)💥 హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 1 || 🌹అర్థం – హే స్వామినాథా, కరుణాకరా, దీనబాంధవా, శ్రీ పార్వతీశ (శివ) ముఖ కమలమునకు బంధుడా (పుత్రుడా), శ్రీశ (ధనపతి) మొదలగు దేవగణములచే పూజింపబడు పాదపద్మములు కలిగిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము. దేవాదిదేవనుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 2 || 🌹అర్థం – దేవాదిదేవునిచే (శివుడిచే) ప్రశంశింపబడువాడా, దేవగణములకు అధిపతీ, దేవేంద్రునిచే వందనము చేయబడు మృదువైన పద్మములవంటి పాదములు కలవాడా, దేవ ఋషి అయిన నారద మ...

💥శివుని గుడికి వెళ్ళినపుడు సందర్శన విధానం:

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 శివుని గుడికి వెళ్ళినపుడు సందర్శన విధానం: సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది.  శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాలకు 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. 💥శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.. "పశ్చిమాభిముఖమైన" శివాలయం.. అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని "సద్యోజాత" శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, "ఓం సద్యోజాత ముఖాయ నమః" అని స...