Posts

మాఘపురాణం - 18వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 18వ అధ్యాయము పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన ఒక పిసినారి వృత్తాంతమును తెలియచేసాడు. “పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడను పేరు గల పెద్ద పల్లెలో . బంగారుశెట్టి అనే వైశ్యుడు ఉండే వాడు. అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపద చాలా ఉన్నది. అతడు ఇంకా ధనాశ కలవాడై తనవద్ద ఉన్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు. ఒక్కనాడైనా హరిని ధ్యానించడము కానీ, దానధర్మములు చేయుట గానీ ఎరుగడు. బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాడు. ఆరోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి “తల్లీ! నేను ముసలివాడిని. నా గ్రామము చేరవలయునన్న ఇంకా పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి పడుతున్నది. ఆకాశంలో మేఘములు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈర...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 ఆబాల-గోపాలం ఇష్టపడే దేవుడు గణేశుడు. పండిత, పామరజన రంజకుడు మన ‘వినాయకుడు’. ఆయన రూపం- ఆనంద దాయకం. ఆయన కథ- నవ రస భరితం. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌  మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.  కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై  యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. ఓమ్ వికట రూపాయ నమః!! సగం గజం- సగం మానవ రూపం- వికట రూపుడు!! చూడగానే ఆనందమును కలిగించే రూపం!! ఇలా రూపాలు ధరించిన దేవతలు ఉపాసకులకు సత్వర ఫలితాలు ఇస్తారని పెద్దలు చెబుతారు. ఓమ్ సుముఖాయ నమః !! అతని ముఖము గజ ముఖం. గజం అంటె ఏనుగు ! తిరగ వేస్తే జగం అంటే ప్రపంచం !! ఆయనే విశ్వం- విశ్వమే ఆయన ! గజం ఐశ్వర్య స్వరూపం!! అందుకే లక్ష్మీ దేవికి ఇరు వైపుల అమృత ధారలు వర్షించే ఏనుగులు వుంటాయి.!! సుముఖత్వము అంటే ప్రతి మంచి విషయం పట్ల సుముఖత వ్యక్తం చేయటం. ఓం వక్రతుండాయ నమః!! ఏనుగు తుండము వక్రంగా వుంటుంది!! తుండము ‘ఓం’ కారానికి ప్రతీక. ఎంత కఠినమైన పని అయినా ఎంత సూక్ష్మమైన పని అయినా మనం చేయగలగాలి ! ఇది ఏనుగు తుండం యొక్క విశేషం!! ఈ విషయాన్ని ఈ నామం తెలియజ...

మాఘపురాణం - 17వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 17వ అధ్యాయము కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ఠా! నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరికొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖీ! చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు గావున ఈ మాఘమాసమంత ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు. తరువాత తులసి...

వల్లీదేవసేనలు - స్వామికల్యాణం.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥వల్లీదేవసేనలు - స్వామికల్యాణం. తమిళ వాఙ్మయం ప్రకారం శూరపద్మునిపై విజయం తరువాత సుబ్రహ్మణ్యుడు తిరుచెందూరులో కొన్నాళ్లు నివసించాడు. ఇంద్రాది దేవతలు స్వామిని అక్కడ కొలిచారు. తొలుత కైలాసంలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు కుమారుడు శ్రీమహావిష్ణువు పుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లిలను చూస్తాడు. సుబ్రహ్మణ్యుని అందాన్ని, యశస్సును చూసి వారు అతనిని కోరుకుంటారు.  సుబ్రహ్మణ్యుడు వారిని మరల జన్మ ఎత్తవలసిందిగా సలహా ఇస్తాడు. అప్పుడు అమృతవల్లి ఇంద్రుని కుమార్తెగా జన్మించి దేవసేన అని పేరొందగా సుందరవల్లి దక్షిణ భారతాన కొండ జాతిలో నంబిరాజు కుమార్తెగా జన్మించి వల్లిగా పేరొందింది. ఇంద్రుడు తిరుచెందూరులో స్వామిని కొలుస్తూ పెరిగిన తన బిడ్డ దేవసేనను వివాహం చేసుకోవలసిందిగా స్వామి కోరతాడు. స్వామి ఇంద్రుని కోరిక మన్నించి మదురై సమీపంలోని తిరుపురకుండ్రంలో బస చేస్తాడు. ఇంద్రాది దేవతలు, గౌరీశంకరులు, గణపతి మొదలైన వారి సమక్షాన సుబ్రహ్మణ్యుడు-దేవసేనల వివాహం వైభవంగా జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠంలో స్వామి దర్శనానికై...

💥 మాఘపురాణం - అధ్యాయం 16

Image
 ⚜️🕉️💥 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - అధ్యాయం 16 ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినది విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పసాగాడు. మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవుతాడు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ మాఘస్నానం మొదలు పెట్టిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులు అవుతారు. అందులో అణుమాత్రమైననూ సంశయము లేదని పార్వతీదేవికి శంకరుడు వివరించగా పార్వతిదేవి మరల ఇట్లు పలికెను. “నాధా ! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసిన మనోవాంఛాఫలసిద్ధి కలుగుతుందని చెప్పారు గదా! ఆ వ్రత విధానము ఎటువంటిదో ఎలా ఆచరించవలెనో వివరముగా తెలియపరచ’ మని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది. మహేశ్వరుడు పార్వతితో - “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, ఒక మంటపము ఉంచి, ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకముల...

శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము💥 ఆది శంకరులు రచించిన అద్భుతమైన స్తోత్రము శివ పంచాక్షరీ. ఇది శివుని పంచాక్షరీ మంత్రమైన నమః శివాయ లోని ప్రతి అక్షరాన్ని శివుని రూపంగా, కొన్ని లక్షణాలతో, ప్రాసలో వర్ణించబడింది. అత్యంత మహిమాన్వితమైనది. ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥ తాత్పర్యము: నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥ తాత్పర్యము: మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్...

💥 మాఘపురాణం - 15వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 15వ అధ్యాయము శిష్యుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతికి తెలియచేసాడు. నీలకంఠుని పార్వతీ దేవి - “నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వినకుతుహలముగా ఉన్నద” ని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు. “సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభస్తున్నాన’ ని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చి, నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా మెల్లగా ...