Posts

మాఘపురాణం - 23వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 23వ అధ్యాయము బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారి నలుగురికి నిండు యవ్వనవతులైన నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి తమను వివాహము చేసుకోమని బలవంతము చేసారూ. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. ఆ కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించారు. “మీరుకూడా పిశాచులగుదురు గాక” అని విద్యార్ది ప్రతిశాపము ఇచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుతు ఉండేవారు. కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎలా పోతాయని అడిగారు. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపములు తొలగి పోతాయి” అని చెప్పాడు. అలా చేయటము చేత ఆ నలుగురికి యధారూపములు కలిగాయి. అలా జర...

మాఘపురాణం - 22వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🌹 💥 మాఘపురాణం - 22వ అధ్యాయము గంగాజల మహత్యము దత్తాత్రేయుడు శివపూజ గురించి, శివమహత్యమును గురించి వివరిస్తాను అని ఇంకా ఈ విధముగా చెప్పసాగాడు. శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి, శివుని ధ్యానించి, వారధిని దాటి రావణుని చంపాడు. హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి, మహాబలమును సంపాదించి సముద్రమును దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొన్నారు. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకొన్నారు. పూజలందు శివపూజ పవిత్రమైనది.  విష్ణు పాదములనుండి పుట్టిన గంగ పరమపవిత్రమై శివుని శిరస్సునుండి ప్రవహించుట వలన సర్వపాపరహితమైనది. గంగాజలములలో స్నానము చేసిన మహాపాపములు సైతం హరించిపోతాయి. గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ!’ అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొన్నఅది గంగాజలంతో సమానము అవుతుంది. గంగ విష్ణుమూర్తి ప్రతిరూప...

సూర్యుడిని ఎలా ఉపాసించాలి?

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 💥 సూర్యుడిని ఎలా ఉపాసించాలి? త్రికాలాల్లో సూర్యారాధన... బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర: | సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకర: || సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు. 🌹ప్రాత:కాలం : బ్రహ్మముహూర్తంలో సూర్యదండకాన్ని స్మరిస్తూ నిద్రలేచి, కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకోవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తిచేసుకున్న తర్వాత సూర్యమంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. సూర్యతర్పణం అనంతరం తులసికోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. 🌹మధ్యాహ్నకాలం : మాధ్యాహ్నిక అర్చన తర్వాత సూర్యనారాయణస్వామి రూపును లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించాలి. మహానివేదన సమర్పించి, ఆదిత్యహృదయం పారాయణ చెయ్యాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. 🌹సాయంకాలం : నీరెండగా ఉన్న సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకుని, సూర్యభగవానుడికి షోడశ ఉపచారాలతో పూజ చెయ్యాలి. నివేదన చేసి, హారతి సమర్పించాలి. సూర్యాష్టకం, దండకం పారాయణ చెయ్యాలి. 🌹సూర్య...

మాఘపురాణం - 21వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 21వ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తు ఉండేవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొన్నాను. మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు. మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదని ” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. “భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా లేవు. అందులో 12 నదులు ముఖ్యమైనవి. అందుచేతనే వీటియందు పుష్కర ప్రవేశం కలుగుతు ఉంటుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆ నదులకు పుష్కరము ప్రారంభమగును. ఆ సమయమ...

మాఘపురాణం - 20వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 20వ అధ్యాయము భీముడు ఏకాదశీ వ్రతము చేయుట పంచపాండవులలో రెండవ వాడయిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు. “అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు. “సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చ...

శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం

Image
 ⚜️🕉️🚩ఓం దుర్గాయై నమః🌹🙏 💥 శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం💥 శ్రీకృష్ణ ఉవాచ । త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ । త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా ॥ 1 ॥ కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయమ్ । పరబ్రహ్మస్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ ॥ 2 ॥ తేజః స్వరూపా పరమా భక్తానుగ్రవిగ్రహా । సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా పరాత్పరా ॥ 3 ॥ సర్వబీజస్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా । సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళమంగళా ॥ 4 ॥ సర్వబుద్ధిస్వరూపా చ సర్వశక్తిస్వరూపిణీ । సర్వజ్ఞానప్రదా దేవీ సర్వజ్ఞా సర్వభావినీ ॥ 5 ॥ త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధా స్వయమ్ । దక్షిణా సర్వదానే చ సర్వశక్తిస్వరూపిణీ ॥ 6 ॥ నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా । క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ కాంతిస్తుష్టిశ్చ శాశ్వతీ ॥ 7 ॥ శ్రద్ధా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా । సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతామిహ ॥ 8 ॥ ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా । శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినామ్ ॥ 9 ॥ దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ । హితాయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ ॥ 10 ॥ యోగిన...

మాఘపురాణం - 19వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 19వ అధ్యాయము ఏకాదశీ మహత్యము సంవత్సరములో వచ్చు 12 మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవునకు చేసిన పాపములన్నియు హరించిపోతాయి. పూర్వం అనంతుడు విప్రుడు యమునా నదీతీరమునందున్న అగ్రహారంలో నివసిస్తు ఉండేవాడు. అతని పూర్వీకులు గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందిన వారు. అతడు చిన్నతనం నుంచి గడసరి, పెంకివాడు. తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొన్నాడు. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంటూ సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలమునకు వృద్ధుడు అయ్యాడు. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకునే సమయములో “అయ్యో! నేనెంతటి పాపాత్ముడను ! శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తిని ఇచ్చే పుణ్యకార్యము ఒక్కటి చేయలేదని ఆలోచిస్తూ పశ్చాత్తాపము చెందుతూ నిద్రపోయాడు. ఒకేవిధముగా అన్ని రోజులు ఉండవు. ఆరోజు రా...