Posts

"శనైశ్చర" కృత "శ్రీ నరసింహ స్తుతి"

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏 💥 "శనైశ్చర" కృత  "శ్రీ నరసింహ స్తుతి" అనేది "శనైశ్చరుడు" చేసిన ప్రార్థన. శ్రీనరసింహ స్వామి మరియు శనైశ్చరుడు మధ్య జరిగిన సంభాషణగా "శ్రీకృష్ణుడు" ద్వారా తెలియజేయబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, "ఈ భక్తి ప్రార్ధన రూపంలో శనిదేవుడు మరియు నృసింహ భగవానుడు మధ్య జరిగే ఈ సంభాషణను ఎవరు వింటారో లేదా పఠిస్తారో వారికి ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. 💥ఏలినాటి శని (7/ 12 సంవత్సరాలు), అష్టమశని, అర్ధాష్టమశని, శనిమహాదశ లేదా శనిఅంతర్ధశ జరుగుతున్నప్పుడు "శనైశ్చర కృత శ్రీనరసింహ స్తుతి" చెయ్యడం చాల శక్తివంతమైన పరిహారక్రియ గా విశ్వసిస్తారు. 💥 ॥ శ్రీనరసింహ స్తుతి (శనైశ్చర కృతం) ॥💥 శ్రీ కృష్ణ ఉవాచ | సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసామ్ | అనన్యగతికానాం చ ప్రభుర్భక్తైకవత్సలః || ౧ || శనైశ్చరస్తత్ర నృసింహదేవ స్తుతిం చకారామల చిత్తవృతిః | ప్రణమ్య సాష్టాంగమశేషలోక కిరీట నీరాజిత పాదపద్మమ్ || ౨ || శ్రీ శనిరువాచ | యత్పాదపంకజరజః పరమాదరేణ సంసేవితం సకలకల్మషరాశి...

💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥 శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని అనేది భక్తాగ్రేసరుడైన హనుమంతుని అనుగ్రహం కోసం రోజూ పఠించదగిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీనిని భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించడం వల్ల సమస్త భయాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః|| శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః || అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః || పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల...

💥చంద్రశేఖరుడు🌙

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 చంద్రశేఖరుడు 🌙 శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి. చంద్రుడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహా శక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు.  అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు.  దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాటాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒకో రోజు ఒకో భార్య వద్ద ఉండసాగాడు చంద్రడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచేకొద్...

💥॥ శ్రీ సూర్య స్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పండితులు ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని భావితరాలకు అందించారు. ఆ స్తోత్రాన్ని చెప్తూ సూర్యదేవున్ని ఆరాధిస్తే.. పూజిస్తే వారిని అన్నీ శుభాలే జరుగుతాయి. ఉదయాన్నే కొందరికి సూర్య నమస్కారం చేయడం అలవాటు. అలాంటి వారు సూర్యుడిని దర్శించి నమస్కరించే సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే సూర్యదేవుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. 💥॥ శ్రీ సూర్య స్తోత్రం ॥💥 #ధ్యానం: ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ | ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః | జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ || బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః | అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ || ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః | సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ || పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః | అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || ౫ || కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః | ధర్మమూర్తిర...

వైశాఖపురాణం 30వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 30 30వ అధ్యాయము - పుష్కరిణి - ఫలశ్రుతి నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును. దేవాసురు...

వైశాఖ అమావాస్య శని జయంతి.

Image
 🕉️⚜️🚩 ఓం శనైశ్చరాయ నమః🌹 🙏 నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం వైశాఖ అమావాస్య నాడు " శని జయంతి " జరుపుతారు. శనైశ్చరునికి సంబంధించిన ఈ తిధిని "శని అమావాస్య" అని కూడా అంటారు. పురాణాల ప్రకారం.. సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం శని. సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది. ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఛాయకు, సూర్యుడికి పుట్టిన కుమారుడే శని. కొంతకాలానికి సంజ్ఞాదేవి పుట్టింటి నుంచి తిరిగివస్తుంది. సవతి కుమారుడు కావటంతో శనిని ఆమె సరిగ్గా చూడదు. ఇందుకు కోపించిన శని ఆమెను కాలితో తన్నుతాడు. దీనికి ప్రతిగా సంజ్ఞ, శనిని ‘మందగమనంతో సంచరిస్తావ’ని శపిస్తుంది. అప్పటినుంచి శనికి మందుడనే పేరు ఏర్పడింది. సూర్యుడి చుట్టూ శని నెమ్మదిగా పరిభ్రమించడానికి కారణం కూడా ఇదే. శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, క్రూరదృక్‌, క్రూరలోచనుడు, పంగుడు, గృధ్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి. కృతయుగం నాటి సందర్భం ఇది. కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినవాడంటూ...

వైశాఖపురాణం 29వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 29. 29వ అధ్యాయము - సత్యశీలునీ మోక్షప్రాప్తి నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను. మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతు...