మత్స్యావతార స్వరూప స్తుతి..
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి. అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు. 💥 మత్స్యావతార స్వరూప స్తుతి.. తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! #భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు. కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను ద్యన్నయ మూర్త...