Posts

వైశాఖపురాణం 06 అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 06 06 అధ్యాయము - వైశాఖమాస వైశిష్ట్యం నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువన...

💥ఉచ్ఛిష్టగణపతి స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 "ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రం" గణేశుడి దివ్యక్రీడలు, శక్తి, కరుణ, జ్ఞానం, మోక్షప్రసాదం వంటి అంశాలను స్తుతిస్తుంది. ఆయన శివపుత్రుడిగా, పార్వతీప్రియుడిగా, విఘ్ననాశకుడిగా సర్వలోకాల ఆరాధ్యుడు. తండ్రికి గంగా జలంతో పూజచేసిన కర్తవ్యభక్తుడు. వ్యాసమహర్షి రాసిన పురాణాలకు ప్రేరణగా నిలిచిన విజ్ఞానస్వరూపుడు. ఈ స్తోత్రాన్ని స్మరించినవారికి దారిద్ర్యం తొలగి, శ్రేయస్సు, జ్ఞానం, ఆనందం కలుగుతాయి. గణేశుడు భక్తుల హృదయంలో ఎల్లప్పుడూ విఘ్నరహిత మార్గాన్ని ప్రసాదిస్తాడు. 💥 ఉచ్ఛిష్టగణపతి స్తోత్రం 💥 దేవ్యువాచ | నమామి దేవం సకలార్థదం తం సువర్ణవర్ణం భుజగోపవీతం | గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ ||1|| #తాత్పర్యం:  సర్వకామప్రదాత అయిన స్వర్ణవర్ణుడైన, సర్పాన్ని యజ్ఞోపవీతంలా ధరించిన, ఏకదంతుడైన, లంబోదరుడైన, సూర్యప్రభావంతో ప్రకాశించే గజాననుని నమస్కరిస్తున్నాను. కేయూరిణం హారకిరీటజుష్టం చతుర్భుజం పాశవరాభయాని | సృణిం చ హస్తం గణపం త్రినేత్రం సచామరస్త్రీయుగలేన యుక్తం ||2|| #తాత్పర్యం:  కంకణాలు, కిరీటాలు ధరించి, నాలుగు చేతులతో పాశం, వరం, అభయం, సృణి ధరించిన, త్రినేత్రుడైన గణపతి...

వైశాఖ పురాణం పంచమ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వైశాఖపురాణం - 05 5వ అధ్యాయము - వైశాఖధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు, వెండిపాత్రల లోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్...

వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 💥ఆధ్యాత్మిక జగత్తుకు మార్గదర్శి.. జగద్గురు ఆదిశంకరాచార్యులు. వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి . శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం | నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || భారత ఆధ్యాత్మిక చరిత్రలో జగద్గురు ఆదిశంకరాచార్యులు మహనీయులు. కేవలం 32 ఏళ్ల జీవితంలోనే ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి మార్గదర్శకంగా నిలిచింది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని సులభంగా వివరించారు. విభిన్న ఆరాధనా మార్గాలలో ఏకత్వాన్ని చూపించి, మతసామరస్యాన్ని నెలకొల్పారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ముఖ్యులు. కేవలం 32 సంవత్సరాల చిన్న జీవితం గడిపినప్పటికీ.. ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి దివ్యదీపంలా వెలుగొందుతోంది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, ప్రపంచానికి దాని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహాగురువుగా ఆయనకు అపారమైన గౌరవం లభించింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఆధ్యాత్మిక సంపదల సారాన్ని గ్రహించి, వాటి అంతరార్థాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వి...

💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము. వివిధ దానములు - వాని మాహత్మ్యములు. నారదమహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయ యుంచి వివరింపుమని కోరెను*. *అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండా సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు ఎండలకు బాధపడినవారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు, శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చిన, ఇహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను, కూర్చున్నను, దాత తెలిసీ తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశా...

💥సింహాచల చందనోత్సవం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారసింహాయ నమః🌹🙏 💥సింహాచల చందనోత్సవం💥 శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం       వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం || అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే #అక్షయతృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము.  శ్రీ వరాహ నారసింహ స్వామి ప్రహ్లాద వరదుడు.. ప్రహ్లాదునీ రక్షించి “ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహ నృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు.  వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే. ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రె...

వైశాఖపురాణం 3వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 3 3వ అధ్యాయము  వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహ...