మాఘపురాణం - 20వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 20వ అధ్యాయము భీముడు ఏకాదశీ వ్రతము చేయుట పంచపాండవులలో రెండవ వాడిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు. “అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు. “సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చి...