మాఘపురాణం - 21వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 21వ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తు ఉండేవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొన్నాను. మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు. మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదని ” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. “భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా లేవు. అందులో 12 నదులు ముఖ్యమైనవి. అందుచేతనే వీటియందు పుష్కర ప్రవేశం కలుగుతు ఉంటుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆ నదులకు పుష్కరము ప్రారంభమగును. ఆ సమయమ...