Posts

మాఘపురాణం - 20వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 20వ అధ్యాయము భీముడు ఏకాదశీ వ్రతము చేయుట పంచపాండవులలో రెండవ వాడిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు. “అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు. “సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చి...

శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం

Image
 ⚜️🕉️🚩ఓం దుర్గాయై నమః🌹🙏 💥 శ్రీ కృష్ణ కృత దుర్గా స్తోత్రం💥 శ్రీకృష్ణ ఉవాచ । త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ । త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా ॥ 1 ॥ కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయమ్ । పరబ్రహ్మస్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ ॥ 2 ॥ తేజః స్వరూపా పరమా భక్తానుగ్రవిగ్రహా । సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా పరాత్పరా ॥ 3 ॥ సర్వబీజస్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా । సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళమంగళా ॥ 4 ॥ సర్వబుద్ధిస్వరూపా చ సర్వశక్తిస్వరూపిణీ । సర్వజ్ఞానప్రదా దేవీ సర్వజ్ఞా సర్వభావినీ ॥ 5 ॥ త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధా స్వయమ్ । దక్షిణా సర్వదానే చ సర్వశక్తిస్వరూపిణీ ॥ 6 ॥ నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా । క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ కాంతిస్తుష్టిశ్చ శాశ్వతీ ॥ 7 ॥ శ్రద్ధా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా । సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతామిహ ॥ 8 ॥ ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా । శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినామ్ ॥ 9 ॥ దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ । హితాయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ ॥ 10 ॥ యోగిన...

మాఘపురాణం - 19వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 19వ అధ్యాయము ఏకాదశీ మహత్యము సంవత్సరములో వచ్చు 12 మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవునకు చేసిన పాపములన్నియు హరించిపోతాయి. పూర్వం అనంతుడు విప్రుడు యమునా నదీతీరమునందున్న అగ్రహారంలో నివసిస్తు ఉండేవాడు. అతని పూర్వీకులు గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందిన వారు. అతడు చిన్నతనం నుంచి గడసరి, పెంకివాడు. తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొన్నాడు. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంటూ సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలమునకు వృద్ధుడు అయ్యాడు. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకునే సమయములో “అయ్యో! నేనెంతటి పాపాత్ముడను ! శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తిని ఇచ్చే పుణ్యకార్యము ఒక్కటి చేయలేదని ఆలోచిస్తూ పశ్చాత్తాపము చెందుతూ నిద్రపోయాడు. ఒకేవిధముగా అన్ని రోజులు ఉండవు. ఆరోజు రా...

మాఘపురాణం - 18వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 18వ అధ్యాయము పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన ఒక పిసినారి వృత్తాంతమును తెలియచేసాడు. “పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడను పేరు గల పెద్ద పల్లెలో . బంగారుశెట్టి అనే వైశ్యుడు ఉండే వాడు. అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపద చాలా ఉన్నది. అతడు ఇంకా ధనాశ కలవాడై తనవద్ద ఉన్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు. ఒక్కనాడైనా హరిని ధ్యానించడము కానీ, దానధర్మములు చేయుట గానీ ఎరుగడు. బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాడు. ఆరోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి “తల్లీ! నేను ముసలివాడిని. నా గ్రామము చేరవలయునన్న ఇంకా పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి పడుతున్నది. ఆకాశంలో మేఘములు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈర...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 ఆబాల-గోపాలం ఇష్టపడే దేవుడు గణేశుడు. పండిత, పామరజన రంజకుడు మన ‘వినాయకుడు’. ఆయన రూపం- ఆనంద దాయకం. ఆయన కథ- నవ రస భరితం. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌  మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.  కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై  యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. ఓమ్ వికట రూపాయ నమః!! సగం గజం- సగం మానవ రూపం- వికట రూపుడు!! చూడగానే ఆనందమును కలిగించే రూపం!! ఇలా రూపాలు ధరించిన దేవతలు ఉపాసకులకు సత్వర ఫలితాలు ఇస్తారని పెద్దలు చెబుతారు. ఓమ్ సుముఖాయ నమః !! అతని ముఖము గజ ముఖం. గజం అంటె ఏనుగు ! తిరగ వేస్తే జగం అంటే ప్రపంచం !! ఆయనే విశ్వం- విశ్వమే ఆయన ! గజం ఐశ్వర్య స్వరూపం!! అందుకే లక్ష్మీ దేవికి ఇరు వైపుల అమృత ధారలు వర్షించే ఏనుగులు వుంటాయి.!! సుముఖత్వము అంటే ప్రతి మంచి విషయం పట్ల సుముఖత వ్యక్తం చేయటం. ఓం వక్రతుండాయ నమః!! ఏనుగు తుండము వక్రంగా వుంటుంది!! తుండము ‘ఓం’ కారానికి ప్రతీక. ఎంత కఠినమైన పని అయినా ఎంత సూక్ష్మమైన పని అయినా మనం చేయగలగాలి ! ఇది ఏనుగు తుండం యొక్క విశేషం!! ఈ విషయాన్ని ఈ నామం తెలియజ...

మాఘపురాణం - 17వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 17వ అధ్యాయము కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ఠా! నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరికొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖీ! చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు గావున ఈ మాఘమాసమంత ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు. తరువాత తులసి...

వల్లీదేవసేనలు - స్వామికల్యాణం.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥వల్లీదేవసేనలు - స్వామికల్యాణం. తమిళ వాఙ్మయం ప్రకారం శూరపద్మునిపై విజయం తరువాత సుబ్రహ్మణ్యుడు తిరుచెందూరులో కొన్నాళ్లు నివసించాడు. ఇంద్రాది దేవతలు స్వామిని అక్కడ కొలిచారు. తొలుత కైలాసంలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు కుమారుడు శ్రీమహావిష్ణువు పుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లిలను చూస్తాడు. సుబ్రహ్మణ్యుని అందాన్ని, యశస్సును చూసి వారు అతనిని కోరుకుంటారు.  సుబ్రహ్మణ్యుడు వారిని మరల జన్మ ఎత్తవలసిందిగా సలహా ఇస్తాడు. అప్పుడు అమృతవల్లి ఇంద్రుని కుమార్తెగా జన్మించి దేవసేన అని పేరొందగా సుందరవల్లి దక్షిణ భారతాన కొండ జాతిలో నంబిరాజు కుమార్తెగా జన్మించి వల్లిగా పేరొందింది. ఇంద్రుడు తిరుచెందూరులో స్వామిని కొలుస్తూ పెరిగిన తన బిడ్డ దేవసేనను వివాహం చేసుకోవలసిందిగా స్వామి కోరతాడు. స్వామి ఇంద్రుని కోరిక మన్నించి మదురై సమీపంలోని తిరుపురకుండ్రంలో బస చేస్తాడు. ఇంద్రాది దేవతలు, గౌరీశంకరులు, గణపతి మొదలైన వారి సమక్షాన సుబ్రహ్మణ్యుడు-దేవసేనల వివాహం వైభవంగా జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠంలో స్వామి దర్శనానికై...