Posts

వైశాఖపురాణం 24వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 24 24వ అధ్యాయము - కిరాతుని పూర్వజన్మ నారదుడంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో నిట్లనెను. మహామునీ! దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతననుగ్రహింపబడితిని. మహాత్ములు, సజ్జనులు సహజముగనే దయాస్వభావులు కదా! నీచమైన కిరాతకులమున పుట్టినపాపినగు నేనెక్కడ? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ది కలుగుటయేమి? ఇట్టి యాశ్చర్యపరిణామమునకు మహాత్ములగు మీయనుగ్రహమే కారణమని యనుకొనుచున్నాను. సజ్జనులను, పాపములను కలిగించు హింసాబుద్ది నాకు మరల కలుగకుండ జూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా! ఉత్తముడా! నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నా యందు దయను జూపుము. జ్ఞానీ! పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పినమాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా! సమచిత్తులు, భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు, ఉత్తముడు, తనవాడు, పరుడు అనుభేదముండదు కదా! ఏకాగ్రతతో చిత్తశుద్దిని పొందుటకై అడిగినవారు పాపాత్ములైనను, ...

ద్వాదశాత్మన్ నమోస్తుతే!!🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏 నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః | తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్‌ నమోస్తుతే || -అంటూ సూర్యుడిని కీర్తిస్తున్నది "ఆదిత్య హృదయం" 💥 ద్వాదశాత్మన్ నమోస్తుతే!!🙏 "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ" అన్నింటి కంటె ఏది ఉత్కృష్టమైనదో అది బృహతి. బృమ్హణము అంటే వ్యాపకత్వము. ఏది అన్నిటి కంటె మహోత్కృష్టమైనదో, ఏది అన్నింటి యందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము" వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది. సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము. అది జగతఃస్థుషః - తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము. ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకటే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు. కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు. కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము. కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట. కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము. ఇవన్నీ కలిగించటానికే... "ఏకం సత్ విప్రా బహుదా వదం...

వైశాఖపురాణం 23వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 23. 23వ అధ్యాయము - దంతిల కోహల శాపవిముక్తి నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము. పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మా...

💥నర నారాయణులు💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ! పీతాంబర పరిధాన సురకళ్యాణనిధాన నారాయణ!! 💥నర నారాయణులు💥🙏 నరనారాయణుల వేల సంవత్సరాల తపస్సునకు ఒక లక్ష్యం ఉంది. అదే "సహస్ర కవచుని" సంహారం. సహస్ర కవచుడు ఒక రాక్షసుడు. పుట్టుకతోనే వేయి కవచములను శరీరంలో కలిగి యున్నాడు. వానితో పోరు సలపాలంటే వేయి సంవత్సరాల తపోబలం కావాలి. వాడి సంహారం కానట్లయితే దివిజులకు, మానవులకు, మహర్షులకు కంటకమవుతుంది. ధర్మం నశిస్తుంది. జన జీవన విధానానికి విఘాతం ఏర్పడుతుంది. అందుకే నర నారాయణులుగా వైష్ణవతేజం ఆవిర్భవించింది.  నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు ఇలా సహస్ర కవచునితో తలపడ్డారు. ఒక్కొక్కమారు ఒక్కో కవచం చొప్పున నర నారాయణులు ఆ రాక్షసుని 999 కవచాలు ఛేదించారు.  ఇంక ఒక్క కవచం మాత్రమే ఉంది. కాని వాడు ఆ కవచంతోనే తన జన్మను చాలించాడు. వాని ఆత్మ మాత్రం రాక్షస భావంతో రగిలిపోతూ మరలా జన్మించాడు. అతడే #కర్ణుడు. 💥పుట్టుకతోనే కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. అలాగే నర నారాయణులు మరలా వాని సంహారం కోసమే కృష్ణార్జునులుగా జన్మించారు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం మహాయుద్ధంల...

వైశాఖపురాణం 22వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 22. 22వ అధ్యాయము - పాంచాలరాజు సాయుజ్యము నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను. నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం | యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1 ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం | అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి | తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలని...

🔱💥దుర్గే దుర్గతి నాశని💥🔱

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 🔱💥దుర్గే దుర్గతి నాశని💥🔱 మన సకల దుర్గతుల్ని నాశనం చేసి, మనకు సద్గతుల్ని కలిగించేది "దుర్గా" అని అర్థం. 'దు' అంటే దారిద్య్రం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలు; 'గ'కారానికి అర్థం శమింపజేయడం, నివారించడం.  "దుర్గా" అనే పదంలోని 'అ'కారానికి అర్థం అన్యాయం, అధర్మం, అలసత్వం, అసుర ప్రవృత్తి, అవాంఛనీయం. కనుక 'దుర్గా'దేవి సకల అనర్థాలనీ నివారించి, శాంతి, సౌఖ్యాలను లోకాలకు ప్రసాదించే తల్లి అని అర్థం. "దుర్గ" నామాన్ని జపించినంత మాత్రాన సకల దుఃఖాలు, ఆపదలు తొలగిపోతాయంటారు. శుంభ, నిశుంభ, మహిషాదుల వంటి వేలాది రక్కసుల సంహరించి లోకాలకు విముక్తిని ప్రసాదించిన భగవతి ఆమె. 💥దుర్గాదేవి-#ద్వాత్రింశన్నామావళి💥 దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని దుర్గ...

వైశాఖపురాణం 21వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 21. 21వ అధ్యాయము - పాంచాలరాజు రాజ్యప్రాప్తి నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను. వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యిం...