Posts

వైశాఖపురాణం 10వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 10. 10వ అధ్యాయము - సతీదేహ త్యాగము అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక ...

వైశాఖపురాణం 9వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 9 9వ అధ్యాయము - పిశాచ మోక్షము పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని. పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని ...

వైశాఖపురాణం 8వ అధ్యాయము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 08 8వ అధ్యాయము - వైశాఖమాస దానములు అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను. రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, ...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹 🙏 నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ కార్యసిద్ధిదాయినిగా, సంపత్ప్రదాయినిగా మహాలక్ష్మీ దేవిని పూజించడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రత్యేకించి శ్రావణ, మార్గశిర మాసాల్లో లక్ష్మీ ఆరాధన అభీష్టాలను నెరవేరుస్తుందన్న విశ్వాసం ఉంది. దేశంలో అత్యంత పురాతనమైన లక్ష్మీ మందిరంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పంచగంగ నదీ తీరాన శ్రీ మహాలక్ష్మి కొలువైన క్షేత్రం కొల్హాపూర్‌. పూర్వం దీన్ని ‘కరవీరపురం’ అనేవారు. ఇక్కడ అమ్మవారిని ‘కరవీర వాసిని’గా, ‘అంబాబాయి’గా పిలుస్తారు. కాశీ అంతటి ప్రాచీన క్షేత్రంగా... ఆరువేల ఏళ్ళ నాటిదిగా కొల్హాపూర్‌ భక్తులు పరిగణిస్తారు. కాశీని విడిచిపెట్టి మహా శివుడు ఉండడనీ, అదే విధంగా మహాలక్ష్మి స్థిర నివాసం కొల్హాపూర్‌ అనీ ప్రతీతి. ఈ క్షేత్ర ప్రస్తావన దేవీ భాగవతంలో, స్కాంద పురాణంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవదిగానూ కొల్హాపూర్‌కు విశిష్టత ఉంది. సతీదేవి దేహంతో శివుడు తాండవం చేస్తున్నప్పుడు.. ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయనీ, సర్వేం...

వైశాఖపురాణం 7వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 07 7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️ 🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹 🙏 ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే । నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ ఉపదేశం విభిన్న రూపాలలో ఉంటుంది. ఉత్తమ గురువు తాను ఉపదేశం చేసే వారి అభిలాష, గ్రాహ్య శక్తి, జిజ్ఞాసలను బట్టి అది ఏ రూపంలో ఇవ్వాలో, ఎంత స్థాయిలో ఇవ్వాలో నిర్ణయం చేస్తాడు. అంతేకాదు.. విద్యార్థి సంకల్పశక్తి, దానికి అతడు జత చేయగల ధృతి స్థాయిని కూడ అంచనా వేస్తాడు. అపుడే ఉపదేశ పద్దతి, దాని స్థాయిని, లోతును నిర్ణయం చేస్తాడు. సామాన్యులకు వాగ్రూప ఉపదేశం. కొంత పక్వ మనస్కు లకు నయనోపదేశం. అతి పక్వచిత్తులకు మౌనమే ఉపదేశం అవుతుంది. గురూపదేశంలో పద్ధతులు ఇవి. దీనికి మరొక కోణం ఉంది. గురువు తన ప్రవర్తన ద్వారా, మాట్లాడే తీరు వల్ల ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఎన్నో గొప్ప విషయాలను చెప్పకనే చెపుతాడు. అంటే, పరిశీలనాసక్తి తన శిష్యుల్లో పెంపొందేటట్టు చేస్తాడు. పరిశీలన దృష్టిని అలవరచుకున్న శిష్యులు తమ నిర్ణీత విద్యాభ్యాస కాలానికే నేర్చుకోవటం పరిమితం చేయరు. తమ జీవితాంతం పరిశీలన అన్న అలవాటును వీడరు.  వీరు గురువు ద్వారా నేర్చు కున్న విద్యను, జ్ఞానాన్ని అనూహ్యమైన రీతిలో వృద్ధి చేస్తారు. గు...

వైశాఖపురాణం 06 అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 06 06 అధ్యాయము - వైశాఖమాస వైశిష్ట్యం నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువన...