Posts

మాఘపురాణం - 17వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 17వ అధ్యాయము కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ఠా! నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసాడు. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను. మరికొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించింది. ఒకనాడు నా భర్త సఖీ! చాలా పవిత్రమైన మాఘమాసము ప్రవేశించినది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేస్తున్నాను. నువ్వు నా భార్యవు గావున ఈ మాఘమాసమంత ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరించు. తరువాత తులసి...

వల్లీదేవసేనలు - స్వామికల్యాణం.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥వల్లీదేవసేనలు - స్వామికల్యాణం. తమిళ వాఙ్మయం ప్రకారం శూరపద్మునిపై విజయం తరువాత సుబ్రహ్మణ్యుడు తిరుచెందూరులో కొన్నాళ్లు నివసించాడు. ఇంద్రాది దేవతలు స్వామిని అక్కడ కొలిచారు. తొలుత కైలాసంలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు కుమారుడు శ్రీమహావిష్ణువు పుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లిలను చూస్తాడు. సుబ్రహ్మణ్యుని అందాన్ని, యశస్సును చూసి వారు అతనిని కోరుకుంటారు.  సుబ్రహ్మణ్యుడు వారిని మరల జన్మ ఎత్తవలసిందిగా సలహా ఇస్తాడు. అప్పుడు అమృతవల్లి ఇంద్రుని కుమార్తెగా జన్మించి దేవసేన అని పేరొందగా సుందరవల్లి దక్షిణ భారతాన కొండ జాతిలో నంబిరాజు కుమార్తెగా జన్మించి వల్లిగా పేరొందింది. ఇంద్రుడు తిరుచెందూరులో స్వామిని కొలుస్తూ పెరిగిన తన బిడ్డ దేవసేనను వివాహం చేసుకోవలసిందిగా స్వామి కోరతాడు. స్వామి ఇంద్రుని కోరిక మన్నించి మదురై సమీపంలోని తిరుపురకుండ్రంలో బస చేస్తాడు. ఇంద్రాది దేవతలు, గౌరీశంకరులు, గణపతి మొదలైన వారి సమక్షాన సుబ్రహ్మణ్యుడు-దేవసేనల వివాహం వైభవంగా జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠంలో స్వామి దర్శనానికై...

💥 మాఘపురాణం - అధ్యాయం 16

Image
 ⚜️🕉️💥 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - అధ్యాయం 16 ఆడకుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా! సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినది విన్నావు కదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈవిధముగా చెప్పసాగాడు. మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవుతాడు. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ మాఘస్నానం మొదలు పెట్టిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోతాయి. మాఘశుద్ధ దశిమనాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన యెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులు అవుతారు. అందులో అణుమాత్రమైననూ సంశయము లేదని పార్వతీదేవికి శంకరుడు వివరించగా పార్వతిదేవి మరల ఇట్లు పలికెను. “నాధా ! శ్రీలక్ష్మీ నారాయణుల వ్రతము చేసిన మనోవాంఛాఫలసిద్ధి కలుగుతుందని చెప్పారు గదా! ఆ వ్రత విధానము ఎటువంటిదో ఎలా ఆచరించవలెనో వివరముగా తెలియపరచ’ మని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది. మహేశ్వరుడు పార్వతితో - “మాఘ శుద్ధ దశమినాడు ప్రాతః కాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని, ఇంటివద్ద గాని, ఒక మంటపము ఉంచి, ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపం మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి, అన్నిరకముల...

శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము💥 ఆది శంకరులు రచించిన అద్భుతమైన స్తోత్రము శివ పంచాక్షరీ. ఇది శివుని పంచాక్షరీ మంత్రమైన నమః శివాయ లోని ప్రతి అక్షరాన్ని శివుని రూపంగా, కొన్ని లక్షణాలతో, ప్రాసలో వర్ణించబడింది. అత్యంత మహిమాన్వితమైనది. ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥ తాత్పర్యము: నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥ తాత్పర్యము: మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్...

💥 మాఘపురాణం - 15వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 15వ అధ్యాయము శిష్యుడు పశ్చాత్తాపము పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానమువలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించారని శివుడు పార్వతికి తెలియచేసాడు. నీలకంఠుని పార్వతీ దేవి - “నాధా! సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగ తెలియచెప్పారు. సుబుద్ధి శిష్యుడు సుమిత్రుడు ఏమైనాడు? అతడు ఏ స్థితిలో ఉన్నాడు? వినకుతుహలముగా ఉన్నద” ని కోరగా శివుడు ఈ విధముగా చెప్పసాగాడు. “సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగక్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము కలిగింది. తాను చేసిన పాపమునకు ఫలితము అనుభస్తున్నాన’ ని పశ్చాత్తాప మనస్కుడై గురువు గారి వద్దకు పోయి పాదములపై పడి “గురువర్యా! నేను మహా పాపిని అయ్యాను. క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అది నాదోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి వెళుతుండగా దారియందున్న ఉద్యానవనంలో నీకుమార్తె చెలికత్తెలతో బంతులాడుకుంటూ నేను ఏకాంతముగా పోవుట చూచి నెమ్మదిగా నావెంట వచ్చి, నేను అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టుక్రింద విశ్రమించగా మెల్లగా ...

మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి హిందూ సాంప్రదాయంలో మాఘ పౌర్ణమి (మాఘ పూర్ణిమ) అత్యంత పవిత్రమైన రోజుగా గుర్తింపు పొందింది. దీనిని "మహామాఘి" అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ఉండగా, నది లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, విష్ణు–శివ అనుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం మొత్తం పవిత్రమైనదే అయినా, పౌర్ణమి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని పండితుల అభిప్రాయం. మాఘమాసంలో, ముఖ్యంగా పౌర్ణమి రోజున పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా నశిస్తాయని పద్మ పురాణం పేర్కొంటుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడు గంగానదిలో నివసిస్తాడని విశ్వాసం ఉంది. అలాగే దేవతలు భూమికి వచ్చి గంగానదిలో స్నానం చేస్తారని పురాణ గాథలు చెబుతాయి. అందుకే ఈ రోజున చేసే స్నానం, పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్మకం. హిందూ ధర్మంలో “నదీనాం సాగరో గతి” అనే భావన ఉంది. అన్ని పవిత్ర నదులూ చివరకు సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి, సముద్ర స్నానం చేయడం వల్ల సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్...

మాఘపురాణం - 14వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹 🙏 💥 మాఘపురాణం - 14వ అధ్యాయము బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఓ దిలీపుమహారాజా ! మాఘమాసములో స్నానము ఆచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా! ఒక విప్రకన్య తన భర్తతో విష్ణు సాయుజ్యమును ఎలా పొందినదో వివరిస్తాను సావధానుడవై విను. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. బుద్ధియందు పేరుకు తగినట్టుగా పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు అవుటచేత అనేకమంది అతనివద్ద శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు సుశీలని పేరు కల బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి కన్నులు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు, అందమైన ముఖవర్చస్సుతో, హంస నడకను మరిపించు నడక, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుసతో ఉన్న ఆమెను చూసిన వారికి మరల మరల చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి ప...