మాఘపురాణం - 24వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 24వ అధ్యాయము విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట - గంధర్వ స్త్రీ వృత్తాంతము మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది. మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానము చేసాడు. అతని భార్య తానుమాత్రం స్నానము ఆచరించనని చెప్పుట వలన ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి ఆయన్ని వయ్యారంగా క్రీగంట చూసింది. ఆమె అందము, యౌవ్వనము చూసిన విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కామక్రీడలతో తేలియాడసాగారు. గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యమును చూచి మండిపడుచు విశ్వామిత్రుని “నువ్వు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖముతో ఉండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్ద...