Posts

మాఘపురాణం - 28వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 28వ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూ...

💥మహా శివరాత్రి విశిష్టత💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 మహా శివరాత్రి విశిష్టత 💥 ‘‘ నమశ్శమ్భవేచ మయోభవేచ నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ’’                           -శ్రీరుద్ర ప్రశ్న (నమకము) "ఇహపరములు రెండింటిలోను సుఖశాంతులు ప్రసాదించు శివునికి నమస్కారం. ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ప్రసాదించే పరమేశ్వరునికి నమస్కారము. దివ్య మంగళ స్వరూపుడైన పరమాత్మకు వందనములు. శుభాలకు మించిన శుభమగు శాశ్వత స్థితిని ప్రసాదించు ఈశ్వరునికి ప్రణామములు. తనను పొందిన వారిని శివమయం చేసి శుభాలను కటాక్షించే శంకరునికి నమస్మృతులు. ఇటువంటి పరమశివునికి నమస్కారములు, పాదాభివందనములు’’ అని, శ్రీరుద్ర ప్రశ్న. అనగా రుద్ర సంహిత (రుద్ర నమకము) ప్రణమిల్లుతోంది. మహాశివరాత్రి ఒక గొప్ప పర్వదినం. అజ్ఞానానికి చిహ్నమైనది రాత్రి.. చీకటి. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎట్లా అయింది. శివ అనగా మంగళకరము. శుభప్రదము అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, శివుని దర్శనమ్, బిల్వార్చన, అభిషేకము, నామ సంకీర్తన వలన అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది. అనగా జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే ఇద...

మాఘపురాణం - 27వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 27వ అధ్యాయము ఋక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నది. దురదృష్టము కొద్దీ పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభింది. చాలా సంవత్సరములు చేయటము వలన అనేక మాఘ మాస స్నాన ఫలము దక్కింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచి పెట్టింది. ఆరోజు వైకుంఠ ఏకాదశి అవడముచే వైకుంఠమునకు వెళ్ళింది. చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అయినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమ” అన్న పేరుతో సత్యలోకమునకు పంపాడు.  ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసారు. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుము” అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మ”...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 “సర్వలోక జననీ కమలా యా  దేశ కాల వితతా రమణీ తే సాతిమృద్ వతసికా కుసుమాభోత్ సంగగాపి తవ హృత్కమలస్థా” “ఓ శ్రీనివాసా! ఎల్ల లోకాలకు తల్లి, అన్ని దేశాలలోను, అన్ని కాలాలలోనూ నిన్నే అనుసరిస్తూ, నీ హృదయ కమలంలో నివసిస్తూ, ఎల్లప్పుడూ నిన్నే ధ్యానించే, నీ అర్ధాంగి – లక్ష్మీదేవికి నా నమస్సులు” లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఆమె స్మరణ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అయితే అమ్మవారు జ్ఞానానికి ప్రతినిధి. వేదాలకు అభిమాని. ఆమె అనంతానంత రూపాలను ధరించి, ఎన్నెన్నో ధర్మసూక్ష్మాలను మానవులకు బోధించింది. నారాయణ తత్వము ఎంత ఉన్నతమైనదో, లక్ష్మీతత్వం కూడా అంతే లోతైనది. సర్వ దేవతలకు, సర్వ లోకాలకు, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, శుభాన్ని ప్రసాదించే దయార్ద్ర హృదయురాలు శ్రీ లక్ష్మీ తాయారు. దేవీసూక్తం అని కూడా పేరుపొందిన అంభ్రణీ సూక్తం ఋగ్వేదంలోని ఒక భాగం. ఈ సూక్తం మహాలక్ష్మీ తత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అంభ్రణీ సూక్తమ్ అమ్మవారే మనకు చెబుతున్నట్టుగా ఉత్తమ పురుషలో సాగుతుంది. “నేను ఎవరినైనా సరే చతుర్ముఖ బ్రహ్మగాను, మహారుద్రుడిగాను మార్చగలను. చతుర్ముఖ బ్రహ్మ శిరస్సును ...

మాఘపురాణం - 26వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 26వ అధ్యాయము సుధర్ముడు తండ్రిని చేరుట ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో ! అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసిమొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై పడినందున ఆ రాత్రి అతనికే అపాయము కలుగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయము లేచి అడవిలో ఏకాంతముగా ఉన్నకారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుతున్నాడు. అలా పెరుగుతూ పన్నెండేళ్ళ ప్రాయము వాడయ్యాడు. ప్రతి దినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడు తండ్రీ! అనాధరక్షకా!” అని ప్రార్థిస్తూ, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను ఎందుకు బ్రతికడము...

ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ । దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. "దత్తం" అంటే ఇచ్చినవాడని అర్ధం. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. అలా దత్తాత్రేయడనే నామంతో ప్రసిద్ధి చెందారు. దత్తాత్రేయ స్వామి  ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడనేది పురాణాలు చెబుతున్న మాట. దత్తాత్రేయ స్వామి ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించారు. కార్త్య వీర్యార్జునుడు, పరశు రాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించిన గురువు దత్తాత్రేయ. ఈయన అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించారు.  దత్తాత్రేయుని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము లేనిది. మనసుతో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ. దత్తుని రూపంలో అంతరార్థం విషయానికొస్తే.. శ్రీ దత్తాత్రేయ స్వామి మూడు తలలతో  ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన...

మాఘపురాణం - 25వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 25వ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి నూరుగురు భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి నివారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాధిరాజైనా, తరగని సంపత్తికలవాదు అయినప్పటికీ “అపుత్రస్యగతిర్నాస్తి” అన్నట్టుగా పుత్రసంతానము లేకపోవడముచే తనకు గతులు లేవు కదా! తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు తన రధమెక్కి నైమిశారణ్యములో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి వారికి నమస్కరించి - “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు నూరుగురు భార్యలు. ఒక్కరికీ సంతానము కలుగలేదు. నాకు ఎలా పుత్రసంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులు జాలికలిగి - “రాజా! నీకు సంతానము లేకపోవుటకు కారణము – పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒక్కసారి అయినా మాఘస్నానము చేయలేదు. ఏ ఒక్క దానము ఇవ్వలేద...