Posts

వైశాఖ పురాణం పంచమ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వైశాఖపురాణం - 05 5వ అధ్యాయము - వైశాఖధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు, వెండిపాత్రల లోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్...

వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 💥ఆధ్యాత్మిక జగత్తుకు మార్గదర్శి.. జగద్గురు ఆదిశంకరాచార్యులు. వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి . శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం | నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || భారత ఆధ్యాత్మిక చరిత్రలో జగద్గురు ఆదిశంకరాచార్యులు మహనీయులు. కేవలం 32 ఏళ్ల జీవితంలోనే ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి మార్గదర్శకంగా నిలిచింది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని సులభంగా వివరించారు. విభిన్న ఆరాధనా మార్గాలలో ఏకత్వాన్ని చూపించి, మతసామరస్యాన్ని నెలకొల్పారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ముఖ్యులు. కేవలం 32 సంవత్సరాల చిన్న జీవితం గడిపినప్పటికీ.. ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి దివ్యదీపంలా వెలుగొందుతోంది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, ప్రపంచానికి దాని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహాగురువుగా ఆయనకు అపారమైన గౌరవం లభించింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఆధ్యాత్మిక సంపదల సారాన్ని గ్రహించి, వాటి అంతరార్థాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వి...

💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము. వివిధ దానములు - వాని మాహత్మ్యములు. నారదమహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయ యుంచి వివరింపుమని కోరెను*. *అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండా సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు ఎండలకు బాధపడినవారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు, శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చిన, ఇహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను, కూర్చున్నను, దాత తెలిసీ తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశా...

💥సింహాచల చందనోత్సవం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారసింహాయ నమః🌹🙏 💥సింహాచల చందనోత్సవం💥 శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం       వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం || అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే #అక్షయతృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము.  శ్రీ వరాహ నారసింహ స్వామి ప్రహ్లాద వరదుడు.. ప్రహ్లాదునీ రక్షించి “ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహ నృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు.  వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే. ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రె...

వైశాఖపురాణం 3వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 3 3వ అధ్యాయము  వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహ...

💥 వైశాఖ శుద్ధ తదియ.. అక్షయతృతీయ.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 వైశాఖ శుద్ధ తదియ.. అక్షయతృతీయ .  అక్షయ ఫలాన్ని ఇచ్చేది తృతీయ.. హిందువుల పండుగలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నది అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేసే దానాలు దేవతల, పితృదేవతల గురించి చేసే పూజలు, అక్షయ ఫలాన్ని ఇస్తాయని, ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. తీర్థ స్నానం, తిలలతో పితృ తర్పణం, ఘట దానం, దైవ పూజలు, ఈ దినాన దానం చేయడం అనాదిగా ఆచరణలో ఉంది. నదీస్నానం దానం, తపం, శ్రాద్ధం, హోమం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. అక్షయ తృతీయనాడు పెరుగు అన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉద కుంభం, మున్నగు వాటిని దానం చేయాలని చెప్పబడింది. ఎండలు మెండుగా ఉండే వైశాఖ మాసంలో కుండలలో, జాగ్రత్తగా పెట్టిన నీటిని త్రాగితే, దాహ శాంతి కరంగా ఉండగలదని, మతపెద్దల నిర్ణయానుసారం, నీటితో నిండిన పాత్రలను, కుండలను ( ఉదకుంభ) దానం చేయడం ఆచారంగా మారింది. ఈ రోజున, విష్ణుపూజ లక్ష్మీ నారాయణ రూపంలో చేయాలని, పురుషార్థ చింతామణి యందు పేర్కొనబడింది. గౌరీ పూజ గౌరీ వ్రతం పేరున పూజ చేయడం కొన్ని ప్రాంతాలలో, ఆలయాలలో ఆచారంగా ఉంది. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములు అన...

వైశాఖపురాణం - 2వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వైశాఖపురాణం - 2 2వ అధ్యాయము - అక్షయతృతీయ విశిష్టత నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయఅని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము. పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివ...