మాఘపురాణం - 18వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 18వ అధ్యాయము పిసినిగొట్టు వ్యాపారికి మాఘమాస ఫలము కలుగుట వశిష్ఠ మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన ఒక పిసినారి వృత్తాంతమును తెలియచేసాడు. “పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణప్రాంతమందలి వసంతవాడను పేరు గల పెద్ద పల్లెలో . బంగారుశెట్టి అనే వైశ్యుడు ఉండే వాడు. అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి వట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపద చాలా ఉన్నది. అతడు ఇంకా ధనాశ కలవాడై తనవద్ద ఉన్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు. ఒక్కనాడైనా హరిని ధ్యానించడము కానీ, దానధర్మములు చేయుట గానీ ఎరుగడు. బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలు ఇచ్చి అనుకున్న గడువుకు ఋణము తీర్చనందున తప్పుడు సాక్ష్యములతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు స్వాధీన పరుచుకునే వాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాడు. ఆరోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి “తల్లీ! నేను ముసలివాడిని. నా గ్రామము చేరవలయునన్న ఇంకా పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి పడుతున్నది. ఆకాశంలో మేఘములు ఉరుముతున్నాయి. చల్లగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద ఈర...