Posts

వైశాఖపురాణం 20వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 20. 20వ అధ్యాయము - పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము. పూర్వము గోదావరి తీ...

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 💥భగవంతుడు సర్వాంతర్యామి.. జగత్తంతా నిండి, నిబిడీకృతమై ఉన్నాడని చాటి చెప్పడమే "శ్రీ నరసింహావతార" ఉద్దేశం. తన పుత్రుడి నోట శత్రువు మాట విన్న హిరణ్య కశిపుడికి క్రోధం నిలువెల్లా పాము విషమై కమ్ముకోగా, తన గదను విసురుగా ఎత్తి, స్తంభానికి బలంగా తాటించాడు.  స్తంభంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ నృసింహుడు భీకరంగా హిరణ్య కశిపుని ఒడిసిపట్టి, తన ఒడిలో పెట్టుకొని, వజ్రాల్లాంటి గోళ్లతో చీల్చి చెండాడాడు. ఆ సమయంలో స్వామి ముఖం పరమ భీకరంగా ఉంది. రక్తాన్ని పులుముకొన్న గోళ్లు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని పోలి ఉన్నాయి. హిరణ్యకశిపుడి కడుపు నుంచి వేరు చేసిన పేగులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. ఆ ఉగ్రమూర్తి నిట్టూర్పులు పెనుగాలుల్లా వీచాయి. జూలు నుంచి రక్తం ధారలు కడుతోందని పురాణ వచనం. మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేశాడు. పలువిధాల స్తుతించాడు. స్వామి ప్రసన్నుడై శాంతించాడు. నరసింహుడు ఉగ్రరూపుడైనా భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడంలో కరుణా సముద్రుడు. 💥త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళ...

వైశాఖపురాణం 19వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 19. 19వ అధ్యాయము - విష్ణువు యముని ఊరడించుట నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణు...

ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్

Image
 💥⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 హర హర హర హర సుబ్రహ్మణ్యం!! శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం!! 💥కార్తికేయుడే స్వయంగా "కార్తికేయ స్తోత్రము" పఠించడం వలన కలిగే ఫలశృతిని చెప్పి ఉన్నారు. “ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము" రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు. 💥 ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్💥 శ్రీ గణేశాయ నమః II స్కంద ఉవాచ II యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్త...

వైశాఖపురాణం 18వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 18. 18వ అధ్యాయము - యమదుఃఖ నిరూపణము నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను. వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను. స్వామీ! సర్వలోకపితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక యి...

ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥పరమశివుడు, పరమేశ్వరుడు, ఆదిదేవుడు, పార్వతీ ప్రియుడు, చంద్రశేఖరుడు.. అనంత నామధేయుడైన ఆ పరాత్పరునికి దర్శన స్పర్శన మాత్రాల చేత పాపాలను హరించగల ఒక్క బిల్వ పత్రాన్ని ‘త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం’ అంటూ సమర్పించినా... లేక 'హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ ఒక్క చెంబెడు నీళ్ళు పోసినా.. చివరకు ‘ఓం నమశ్శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ధ్యానం చేసినా చాలు... కరగిపోయి ధన కనక వస్తు వాహన ఆయురారోగ్య ఐశ్వర్య మోక్షాలను సైతం అనుగ్రహించే ఆ పరమేశ్వరునికి శతకోటి ప్రణామాలు. "శివపురాణం"లో నుడివినట్లు పరమశివుని పంచముఖాలలో 'న'కారం ప్రకాశించే ముఖం తూర్పు దిశను చూస్తూ సిద్ధసురాసుర గణాలచే నుతించబడుతున్నదనీ.. 'మ'కారమున విలసిల్లే ముఖం దక్షిణ దిక్కును చూస్తూ అఖండ తేజోవంతంగా ఉంటుందనీ.. 'శి'కార ముఖం గోక్షీరం నురుగువలే శ్వేతవర్ణంలో అరుణ నేత్ర సంయుతంగా ఉంటుందనీ.. పడమటి దిక్కును చూస్తూ బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడుతున్నదనీ..  'వ'కార ముఖం ఉత్తర దిక్కును చూస్తూ గోరవర్ణంతో మందహాసాన్ని వెదజల్లుతుంటుందనీ.. 'య'కారముఖం ఊర్థ్వముఖమై ముప్...

వైశాఖపురాణము 17వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణము - 17. 17వ అధ్యాయము - యముని పరాజయము అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక...