Posts

మాఘపురాణం - 25వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 25వ అధ్యాయము సులక్షణ మహారాజు వృత్తాంతము వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి నూరుగురు భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి నివారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాధిరాజైనా, తరగని సంపత్తికలవాదు అయినప్పటికీ “అపుత్రస్యగతిర్నాస్తి” అన్నట్టుగా పుత్రసంతానము లేకపోవడముచే తనకు గతులు లేవు కదా! తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? తనతో తన వంశం అంతరించి పోవలసినదేనా? అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు తన రధమెక్కి నైమిశారణ్యములో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి వారికి నమస్కరించి - “మునిశ్రేష్ఠులారా! నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు నూరుగురు భార్యలు. ఒక్కరికీ సంతానము కలుగలేదు. నాకు ఎలా పుత్రసంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులు జాలికలిగి - “రాజా! నీకు సంతానము లేకపోవుటకు కారణము – పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒక్కసారి అయినా మాఘస్నానము చేయలేదు. ఏ ఒక్క దానము ఇవ్వలేద...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం" అన్న ప్రార్థనతో హిందువుల శుభకార్యాలు ఆరంభం అవుతాయి. ఈ శ్లోకానికి ఈ విధంగా అర్థం చెప్పుకోవచ్చు.. లోకానికి ఆధారమైన ఆకాశాన్ని తన అదుపులో ఉంచుకొన్నవాడు, చంద్ర కళలతో శుక్ల పక్ష, కృష్ణ పక్షాల మాదిరి ప్రజల సుఖ దుఃఖాలలో అండగా ఉండేవాడు. చతుర్భుజాలతో కాలాన్ని అధీనంలో ఉంచుకొన్నవాడు. ప్రసన్న వదనంతో ఉన్నవానిని అన్ని విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆదిపూజ్యుడు అయిన గణపతి రూప విశేషాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? ఈ వివరాలన్నీ గణేశ పురాణం, గణపతి అధర్వ శీర్షం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణాలలో వివరించారు. అసలు గజ అన్న పదానికి విశేష విశ్లేషణ కనపడుతుంది. గ అంటే గతి. జ అంటే జన్మ. జన్మగతిని నిర్దేశించేవాడు గణపతి. ఏ నిరాకరుని నుండి ఉద్భవిస్తామో చివరికి ఆయనలోనే లీనమవుతాం. 💥గణపతి జన్మ రహస్యం: గజాసురుడు అనే అసురుడు పరమేశ్వరుని తన తపస్సుతో మెప్పించాడు. నిరంతరం తన హృదయ కుహరంలో నివాసముండాలన్న కోరిక కోరారట. భోళాశంకరుడు అంగీకరించి రాక్షసుని హృదయంలో స్థిరపడ్డారట. కైలాసంలో పార్వతీదేవి మహేశ్వరుని గురించి చింతిస్తూ శ్రీ మహావి...

మాఘపురాణం - 24వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 24వ అధ్యాయము విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట - గంధర్వ స్త్రీ వృత్తాంతము మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది. మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానము చేసాడు. అతని భార్య తానుమాత్రం స్నానము ఆచరించనని చెప్పుట వలన ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి ఆయన్ని వయ్యారంగా క్రీగంట చూసింది. ఆమె అందము, యౌవ్వనము చూసిన విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కామక్రీడలతో తేలియాడసాగారు. గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యమును చూచి మండిపడుచు విశ్వామిత్రుని “నువ్వు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖముతో ఉండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్ద...

మాఘపురాణం - 23వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 23వ అధ్యాయము బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారి నలుగురికి నిండు యవ్వనవతులైన నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి తమను వివాహము చేసుకోమని బలవంతము చేసారూ. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను. ఆ కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించారు. “మీరుకూడా పిశాచులగుదురు గాక” అని విద్యార్ది ప్రతిశాపము ఇచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుతు ఉండేవారు. కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎలా పోతాయని అడిగారు. ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపములు తొలగి పోతాయి” అని చెప్పాడు. అలా చేయటము చేత ఆ నలుగురికి యధారూపములు కలిగాయి. అలా జర...

మాఘపురాణం - 22వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🌹 💥 మాఘపురాణం - 22వ అధ్యాయము గంగాజల మహత్యము దత్తాత్రేయుడు శివపూజ గురించి, శివమహత్యమును గురించి వివరిస్తాను అని ఇంకా ఈ విధముగా చెప్పసాగాడు. శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి, శివుని ధ్యానించి, వారధిని దాటి రావణుని చంపాడు. హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి, మహాబలమును సంపాదించి సముద్రమును దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొన్నారు. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకొన్నారు. పూజలందు శివపూజ పవిత్రమైనది.  విష్ణు పాదములనుండి పుట్టిన గంగ పరమపవిత్రమై శివుని శిరస్సునుండి ప్రవహించుట వలన సర్వపాపరహితమైనది. గంగాజలములలో స్నానము చేసిన మహాపాపములు సైతం హరించిపోతాయి. గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ!’ అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొన్నఅది గంగాజలంతో సమానము అవుతుంది. గంగ విష్ణుమూర్తి ప్రతిరూప...

సూర్యుడిని ఎలా ఉపాసించాలి?

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 💥 సూర్యుడిని ఎలా ఉపాసించాలి? త్రికాలాల్లో సూర్యారాధన... బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర: | సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకర: || సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు. 🌹ప్రాత:కాలం : బ్రహ్మముహూర్తంలో సూర్యదండకాన్ని స్మరిస్తూ నిద్రలేచి, కాలోచిత కృత్యాలు పూర్తిచేసుకోవాలి. స్నానం, సంధ్యావందనం, నిత్యార్చన పూర్తిచేసుకున్న తర్వాత సూర్యమంత్రాన్ని ఉపాసన చెయ్యాలి. సూర్యతర్పణం అనంతరం తులసికోటలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. 🌹మధ్యాహ్నకాలం : మాధ్యాహ్నిక అర్చన తర్వాత సూర్యనారాయణస్వామి రూపును లేదా సూర్య సాలగ్రామాన్ని పూజించాలి. మహానివేదన సమర్పించి, ఆదిత్యహృదయం పారాయణ చెయ్యాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. 🌹సాయంకాలం : నీరెండగా ఉన్న సమయంలో సంధ్యావందనం పూర్తి చేసుకుని, సూర్యభగవానుడికి షోడశ ఉపచారాలతో పూజ చెయ్యాలి. నివేదన చేసి, హారతి సమర్పించాలి. సూర్యాష్టకం, దండకం పారాయణ చెయ్యాలి. 🌹సూర్య...

మాఘపురాణం - 21వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 21వ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తు ఉండేవాడు. దత్తాత్రేయుడు అతనికి గురువు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొన్నాను. మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు. మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదని ” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. “భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా లేవు. అందులో 12 నదులు ముఖ్యమైనవి. అందుచేతనే వీటియందు పుష్కర ప్రవేశం కలుగుతు ఉంటుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆ నదులకు పుష్కరము ప్రారంభమగును. ఆ సమయమ...