Posts

💥శ్రీ నృసింహ లీల:

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః🌹🙏 💥శ్రీ నృసింహ లీల: ‘ఆది పురుషుడు’ అంటే దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు. ఆయనే "మృగేంద్రలీల"ను ప్రదర్శించాడు. మృగాల్లో రాజు సింహం కాబట్టి... శ్రీ నరసింహుని లీలకు ‘మృగేంద్ర లీల’ అని కూడా పేరు. అత్యంత సుందరమూర్తి అయిన నారాయణుడు నర-మృగ రూపాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? అదే భక్తుల హృదయాలను రంజిపజేసే సర్వాద్భుతమైన శ్రీ నృసింహ లీల. హిరణ్యకశిపునికి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు తనయుడిగా జన్మించడం ఆశ్చర్యం. ఇది ఆ భగవంతుడి లీల. మన జీవితం మీదా, మన కుటుంబం మీదా నియంత్రణ కలిగి ఉన్నామని అనుకుంటున్నాం. వాస్తవానికి సర్వాన్నీ నియంత్రిస్తున్నది ఆ భగవంతుడొక్కడే. ఆ కాలంలో రాక్షసులు మన లోకానికి వెలుపల నివసించేవారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తిలోనూ సుర, అసుర లక్షణాలు ఉంటున్నాయి. దుష్టులైన శత్రువుల నుంచి పొంచి ఉన్న ఆపదలనుంచి సదా రక్షించాలనీ, మనలోని దుష్ట గుణాలను తొలగించి కాపాడాలనీ ఆ నరసింహుణ్ణి ప్రార్థిద్దాం. 💥పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షస రాజు ఉండేవాడు. అతను అమరత్వం పొందాలనే కోరికతో... బ్రహ్మ దేవుడి సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్...

ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏   బాలసుబ్రహ్మణ్యం_భజేఽహం భక్తకల్పభూరుహం శ్రీ నీలకంఠ హృదానందకరం నిత్య శుద్ధ బుద్ధ ముక్తాంబరమ్ వేలాయుధధరం సుందరం వేదాంతార్థబోధ చతురం ఫాలాక్ష గురుగుహావతారం పరాశక్తిసుకుమారం ధీరమ్ పాలిత గీర్వాణాది సమూహం పఙ్చభూతమయ మాయామోహం నీలకంఠ వాహం సుదేహం నిరతిశయానంద ప్రవాహమ్ 🌹భావం: బాలసుబ్రహ్మణ్యా!! భక్తుల కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, నిన్ను నేను భజిస్తున్నాను. నీలకంఠుడికి అనగా పరమశివునికి ఆనందము కలిగించు వాడా!! వేలాయుధా! అనగా శక్తి శూలమును చేతిలో ధరించినవాడా! వేదాంతార్ధములను బోధించుటలో చతురత కలిగిన వాడా!! ప్రణవార్ధమును ఫాలాక్షుడికి (తండ్రికే) వివరించిన వాడు కదా మన పాలబుగ్గల, పార్వతీ స్వరూపుడు.. బాల సుబ్రహ్మణ్యుడు! పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ముద్దుల కొడుకు, ధీరత్వం కలిగినవాడు, బ్రహ్మాది దేవతలందరినీ పాలించువాడు (దేవసేనాపతి), పంచభూతములతో కూడిన మాయను సృష్ఠించినవాడా! (మహామాయినే నమః అని స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో వస్తుంది..) నెమలిని వాహనముగా కలిగిన వాడా!! సుందరమైన రూపము కలవాడా!! నిరయతిశయ ఆనంద స్వరూపమా! ఓ...

ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ । అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ ॥ బిల్వపత్రం దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశిస్తే సర్వపాపములు నశిస్తాయి.  భక్తిశ్రధ్ధలతో బిల్వ దళాన్ని అర్పిస్తే  ఘోరాతిఘోరమైన పాపాలు తొలగిపోతాయి. అలాంటి త్రిగుణము గల  బిల్వ దళమును నీకు అర్పిస్తున్నాను... నన్ను అనుగ్రహించు పరమేశా అని అర్థం. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!' అని కేకలు వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి... శక్తికి సమర్పించాలి అనుకుంది.  అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అమ్మవారిని వారించి... విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు... నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయనే వరమిచ్చాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి నివేదిత స్థలం అయిన హోమగుండం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు.. అదే బిల్వవృక్షం...

మత్స్యావతార స్వరూప స్తుతి..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి. అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు. 💥 మత్స్యావతార స్వరూప స్తుతి.. తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! #భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.     కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ! మాకు ను ద్యన్నయ మూర్త...

ఓం నమో నారాయణాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥                                                     -భగవద్గీత. "భగవద్గీత"లోని ఈ శ్లోకానికి "#చరమశ్లోకము"అని పేరు. ఈ శ్లోకంలో... "శరణాగతుడైన జీవుడేమి చేయాలో " మొదటి చరణం తెల్పితే, రెండవ చరణంలో "భగవంతుడేమి చేస్తాడో" మనకు స్పష్టమవుతుంది.  "సర్వ ధర్మాల్ని త్యజించి నన్నాశ్రయింపుము. 'అహం’ అంటే నేను- భగవానుడను, సర్వజ్ఞుడను. సర్వశక్తుడను అయిన నేను- ‘త్వా’- నిన్ను, అకించనుడవై, అనన్య గతికుడవై నన్నే ఉపాయంగా నమ్మి వున్న నిన్ను- సమస్త పాపాలనుండి విముక్తుణ్ని చేయగలను" అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అర్జునుని శోకం మాన్పుటకు ఈ ‘చరమ శ్లోకాన్ని’ ఉపదేశించాడు. ఈ ఉపదేశం కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళి కోసం శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం. ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!! 💥భావం: సమస్తములైన శాస్త్రాలను ...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 వక్షో నివాస మకరోత్ పరమం విభూతే/ యత్రస్థితైధయత సాధిపతీం స్త్రీలోకాన్  లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు నాదుడయ్యేనేసి నడప నోపు నితడే భర్త! యనుచు నింతి సరోజాక్షు బుష్పదామకమున బూజ సేసె ! లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకల సద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 1. స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం. 2. సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 3. జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 4. తామస మన్వంతరంలో - భూమి నుండీ, 5. రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ, 6. చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ, 7. వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. 💥చివరిగా చెప్పుకుంటున్న వైవస్వత మన్వంతరంలో - పూర్వం ఒకసారి "దుర్వాస"...

💥గురు పరంపరకు ఆద్యుడు - దత్తాత్రేయుడు

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏 శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥  💥గురు పరంపరకు ఆద్యుడు - దత్తాత్రేయుడు దత్తాత్రేయుడిని స్మరణకు తెచ్చుకోగానే, మూడు ముఖాలు, ఆరు చేతులు, వెనుక కామధేనువు, ఔదుంబర (మేడి) వృక్షం, తన ముందు నాలుగు శునకాలు గల స్వరూపం మదిలో మెదలుతుంది.  త్రిమూర్తుల ప్రతిరూపం, వారికి ఆధారమైన ప్రజ్ఞానమే దేహంగా, షట్ శాస్త్రాలే చేతులుగా, నాలుగుపాదాలపై నిలిచిన ధర్మమే గోవుగా, అవిద్యను నిర్మూలించే నాలుగు వేదాలే శునకాలుగా, విశ్వశాంతియే ఔదుంబర వృక్షంగా దత్తోపాసకులు భావిస్తారు. దత్తాత్రేయుడే గురుపరంపరకు ఆద్యుడని ఆయన ఉపాసకులు విశ్వసిస్తారు. స్వయంగా తండ్రికి జ్ఞానబోధ చేయడం ద్వారా ఆయన గురుపరంపరకు ఆద్యుడయ్యాడని అంటారు. అనంతర కాలంలో దత్తప్రభువు.. కార్తవీర్యార్జునుడు, దలాదనుడు మొదలైన వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడని దత్తపురాణం చెబుతుంది. 💥స్మరించిన క్షణమే.. స్వామి అమిత కరుణామూర్తి అన్నది దత్త భక్తుల దృఢ నమ్మకం. దత్తాత్రేయుడు స్మర్తృగామి.. అంటే, స్మరించిన వారి చెంతకు తక్షణమే చేరి కష్టాలను తీర్చే భగవానుడు.  వింధ్యాచల ప్రాంతంలో ని...