మాఘపురాణం - 28వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 28వ అధ్యాయము విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూ...