అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ"
⚜️🕉️🚩 జై శ్రీ కృష్ణ 💥🌹🙏
🌺🌺 గురుగోవిందం 🌺🌺
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥🌹🙏
💥నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు.
ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడి పారిపోకూడదు.
చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి.
తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి.
గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి #గోవర్ధనగిరి ని చిటికెన వేలి మీద మోశాడు.
తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు.
జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే
జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు.
యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు.
కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు.
దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు.
సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు.
ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుద ముట్టించడమూ ఆయనకి తెలుసు.
కాలయవనుడి ఉదంతంలో కృష్ణుడు ఈ ఎత్తుగడనే వేశాడు. అక్షౌహిణుల కొద్దీ సైన్యంతో తనమీద యుద్ధానికి వచ్చిన కాలయవనుడికి నిరాయుధుడై ఎదురు నిలిచాడు. భయపడినట్టు నటించాడు.
కొండకోనలోకి పరుగులు తీశాడు.
ఒక పాడుబడ్డ గుహను చేరాడు.
ముందూ వెనకా ఆలోచించకుండా కన్నయ్యనే వెంబడిస్తూ గుహలోకి అడుగుపెట్టాడు కాలయవనుడు.
గాఢాంధకారంలో నిద్రపోతున్న ఓ వృద్ధుడిని
చూసి శ్రీకృష్ణుడిగా భ్రమించి ముచికుందమహర్షిని
తట్టిలేపాడు. ఆ ముని ఆగ్రహంతో కళ్లుతెరిచేసరికి
నిలువునా భస్మమైపోయాడు.
అదీ గోవిందుడి వ్యూహమంటే.
భారతంలోనూ అంతే, పాండవ పక్షపాతిలా కనిపించినా వారికీ ఏమీ చేసినట్లుండడు.
దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా...
ఏ సహాయమూ చేయడు.
కానీ తాను నిలిచిన పక్షపు బలాబలాలను తెలుసుకుంటూ ఎత్తులూ పై ఎత్తులూ వేస్తూ పాండవులను విజయపథాన నడిపించాడు.
నాయకుడు ప్రణాళిక, వ్యూహం అన్నీ సమపాళ్లలో రంగరించి బృందాన్ని ముందుకు నడిపించాలనీ, కదన రంగంలో కత్తి పట్టి తీరాలనేమీ లేదనీ వ్యవహారాన్ని చక్కదిద్దే నేర్పు ఉంటే చాలనీ చాటి చెప్పాడు.
శ్రీకృష్ణుడనే నాయకుడే లేకపోతే పాండవుల విజయాన్ని ఊహించనేలేం.
భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు
మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు.
జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు.
మధురమైన మురళీ గానంతో ప్రకృతిని సైతం ఆనందడోలికలో ఓలలాడించాడు.
తలచినంతనే చెంత చేరి పదహారువేల మంది
గోపికల్నీ ప్రేమధారల్లో ముంచెత్తాడు.
మేధాశక్తితో నారితో సైతం వింటి నారిని పట్టించాడు.
యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు. అయినా...
ఏ మూసలోనూ ఒదగడు. ఏ అధికారానికీ లొంగడు.
అందుకే శ్రీకృష్ణుడు...
"అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ"
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment