💥శ్రీకృష్ణావతారం
⚜️🕉️🚩 ఓం శ్రీ కృష్ణాయ నమః 🌹🙏 💥 శ్రీకృష్ణావతారం "కృష్ణం ధర్మం సనాతనం" అని పురాణ వాక్యం. కృష్ణ: అంటే అపరమిత ఆనంద స్వరూపుడు. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనగా సాధు జన రక్షణ, దుష్ట జన శిక్షణ, ధర్మ సంస్థాపనానికై తాను మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్నా అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి కూడా రేప ల్లెలోని గోపాలకులతో, గోపికలతో, గోవులతో కలసి మెలసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్న వారితోనే, వారిలోనే ఉంటానని చాటాడు. బాలునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించే కంసుడు పంపిన రాక్షసులను వధించాడు. చివరికి కంసుని కూడా వధించగా ఆ వైరముతో తనపై కక్ష కట్టి దాడి చేసిన జరాసంధుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు. చక్రవర్తి అయిన జరాసంధుడు ఎపుడు యుద్ధానికి వచ్చినా 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు. అక్షౌహిణి (10 వేల రధాలు, ఇరవై వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, 40 వేల సైన్యం) ఈ విధంగా 18 సార్లు ఓడించి అనగా ...