Posts

Showing posts from April, 2024

💥శ్రీ రామ నామ మహిమ..

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం | అజానుబాహుం మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి || 🌹జానకీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె వవిశాలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను. శ్రీరామనామ జపము సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ... శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే --అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది. ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది.  💥శ్రీ రామ నామ మహిమ.. శ్రీరామనామ మహిమను తె...

త్రికాలాల్లో సూర్యారాధన...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది. కంటికి కనిపించే సకల ప్రపంచాన్ని తన తేజస్సు ద్వారా నడిపించే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు.  అదిత్యుడని, భానుడని, మిత్రుడని... ఎన్నో పేర్లతో పూజలందుకుంటూ, మనలోని అజ్ఞాన తిమిరాల్ని తన కిరణాల ద్వారా దహింపజేస్తూ, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసే దైవం సూర్యనారాయణమూర్తి. సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు.  అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి. 💥సూర్యుడిని ఎలా ఉపాసించాలి? త్రికాలాల్లో సూర్యారాధన... బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వర: | సాయ...

💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... కోరిన కోర్కెలీడేర్చే దేవుడు.. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు.. భక్తుల పాలిట కొంగు బంగారం.. కలియుగ ప్రత్యక్ష దైవం... ఆ తిరుమలేశుడు. పిలిచినంతనే పలికే దేవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే.. సకల జనులను నిత్యం కాపాడే గోవిందుడు.. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడు.  ఆ కమలనాభుని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఒక్క క్షణం ఆ తిరుమలేశుని దర్శనం అయితే చాలు.. సకలం.. సర్వం మరచి.. భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఆ వేంకటేశ్వరుని దర్శనం కాగానే... సకల భక్త కోటి అణువణువూ పులకించిపోతుంది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామము ప్రసిద్ధి చెందింది. మానవ జీవితంలో కలిగే ఆపదలను తొలగించే దేవునిగా, ఆపదమొక్కుల వాడిగా జగత్ప్రసిద్ధి. 💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥 మార్కండేయ ఉవాచ । నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ । ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥ సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు । ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు ...

⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః🌹🙏 💥శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ...  అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకుంటూ షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి, పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగ్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే #గాయత్రీమాత . ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైు ముఖైస్త్రీ క్షణైః యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌ గాయత్రీం వరదాభయాం కుశకశా శ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే! 💥సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలం...

⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥"లక్షయతీతి లక్ష్మీః" అని లక్ష్మీ శబ్దానికి వ్యుత్పత్యర్థం. లక్షింపచేసేదేదో అది లక్ష్మి. జగజ్జనని లక్ష్మీదేవి ఎంత దారి చూపేదైనా ఆ మూలతత్త్వాన్ని అందుకొందామనే దీక్ష మనకి ఉండాలి. సిద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ! శ్రీ లక్ష్మీ ద్వారలక్ష్మీ శ్చ ప్రసన్నా మమ సర్వదా! ! "చంద్రాం హిరణ్మరుూం" చంద్రుడిలా స్వచ్ఛమైనది, సౌమ్యమయినది, ఎటువంటి నామ రూప వాసనా మాలిన్యము లేనిది తల్లి. ఆ తల్లి నా మనసులో ప్రవేశపెట్టి మహాలక్ష్మీదేవిని ఉపాసించేటట్లుచేయమని ప్రార్థిస్తున్నాం మనం. ఎవరిని? అగ్నిదేవుణ్ణి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోధినీమ్ | శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతామ్ ||                                                -శ్రీసూక్తం. గుఱ్ఱాలు ముందుంటే, రథాలు మధ్యలో ఉంటే, ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తూ ఉంటాయి. "ఇంద్రియాణి హయనాహః’’ - ఇంద్రియాలే అశ్వాలు. 'ఆశు గచ్ఛతీతి అశ్వః’ అతి వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవ...

⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ ! త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి !! 💥భావం: మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీదక్షిణామూర్తికి నమస్కృతులు. వీణాం కరైః, పుస్తకమ్ అక్షమాలాం బిభ్రాణమ్ అబ్రాభ గళం వరాఢ్యం ఫణీంద్ర కక్ష్యం మునిభిః శుకాద్యైః సేవ్యం వటాధః కృత నీడ మీడే!  💥"మేధా దక్షిణామూర్తి" సంగీతానికి గుర్తుగా వీణను, విద్యలకు గుర్తుగా పుస్తకం, అక్షరానికి గుర్తుగా అక్షమాలను ధరించి ఉంటాడు. నల్లటి గొంతు భాగం ఆస్వామి గరళ కంఠుడని చెబుతుంది. ఒక నాగుపామును నడుముకు చుట్టుకుని ఉంటాడు. విషసర్పంతో సమానమైన విషయాలను కూడా బంధించగల శక్తి ఆ స్వామికి ఉందనడానికి ఇది సూచనగా భావించాలి. ఒక వట వృక్ష ఛాయలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది. కరుణామయ వీక్షణాలతో వరాలను ప్రసాదిస్తున్నట్లు ఆ స్వామి ముఖం ఉంటుంది. ఆయన సదా "చిన్ముద్ర"లో ఉంటాడు. అగ్నిల...

💥మత్స్యావతార స్వరూప స్తుతి..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మత్స్యావతార స్వరూప స్తుతి.. వేదోద్ధరణకై శ్రీ మహా విష్ణువు మత్స్యావతారం స్వీకరించినప్పుడు ప్రళయ సముద్ర జలాలు భూలోకాన్ని ముంచి వేయబోయాయి. అప్పుడు శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకు వచ్చింది. సత్యవ్రతుడు దానిపై పెక్కు ఓషధుల విత్తనాలను అమర్చాడు. మహా మీనంగా ప్రత్యక్షమైన విష్ణువును చూసి సంతోషించి సత్యవ్రతుడు ఋషులతో పాటు ఆయనను ఇలా స్తుతించాడు.   💥💥💥💥💥 తమలో బుట్టు నవిద్య గప్పిగొనుడుం దన్మూల సంసార వి భ్రములై కొందరు దేలుచుం గలగుచున్ బల్వెంటలన్ దైవ యో గమునం దే పరమేశు గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మ మ్మీశ్వరా! #భావం: ఓ భగవంతుడా! తమలో ఆవరించి ఉన్న అఙ్ఞానం వల్ల కొందరు సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలత పడతారు. కోరికలను వెన్నంటుతారు. అటువంటి వారు అదృష్టం వల్ల పరమత్ముడవైన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోష పడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు.     కన్నులు గల్గు వాడు మరి కానని వానికి ద్రోవ జూపగా జన్న తెరంగు మూఢునకు సన్మతి దా గురుడౌట సూర్యుడే కన్నులు గాగ భూతముల గాంచుచు నుండు రమేశ!...

💥చైత్ర శుద్ధ తదియ.. మత్స్య జయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే । మీనాకారశరీర నమో భక్తం తే పరిపాలయ మామ్ ॥  💥చైత్ర శుద్ధ తదియ.. మత్స్య జయంతి. చైత్ర మాసం శుక్ల పక్షాన మూడవ రోజు.. మత్స్యావతారానికి గుర్తుగా మత్స్య జయంతిని జరుపుకుంటాం.  భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు. ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములలో ప్రసిద్ధమైనది.. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం.  బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు... గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు. వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు.  ఒకరోజు అతను కృతమాలా నదికి వెళ్ళి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాప దుర్ధరమ్ | సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 💥ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకోగా, ఆయనకు అనేక విఘ్నాలు ఎదురయ్యాయి.  ఎంత ప్రయత్నించినా ఆయన కార్యం ముందుకు కదల్లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, పరబ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఎన్నో దివ్యసంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, పరబ్రహ్మ వక్రతుండ గణపతిగా సాక్షాత్కరించి, బ్రహ్మదేవుడికి వక్రతుండ మంత్రాన్ని ఉపదేశించారు.  అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ మాత చేత శ్రీ గణేశుడి సృష్టించబడటానికి పూర్వం నుంచి కూడా ఆయన ఉన్నాడు. శివపార్వతుల కల్యాణంలో కూడా గణపతిని పూజించారు. అంటే గణపతి ఈనాటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము. అందుకే ఒకనాడు ముద్గల, గర్గ మహర్షులతో కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గణపతిని పరబ్రహ్మంగా స్తుతించిన స్తోత్రం కూడా ఉంది. సనాతన ధర్మంలోనే శైవం, శాక్తేయం, వైష్ణవం వలె గాణాపత్యం అనే మతం కూడా ఉంది. ఇందులో గణపతిని పరబ్రహ్మంగా, మిగితా దేవీదేవతలంతా ఆయన అంశలుగా భావించి ...

💥స్కందుడు.. సంకటహరుడు💥

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం | స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం కుమారం స్వామినాధం తం కార్తికేయం నమామ్యహం ‖ 💥స్కందుడు.. సంకటహరుడు💥 సుబ్రహ్మణ్యునికి అనేక పేర్లున్నా ప్రతి నామం వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. ఈ స్కందుడన్న నామం వెనక ఉన్న గాథను రామాయణం ఎరుకపరుస్తోంది. ఒకానొక కాలంలో ఆదిదంపతులు తల్లిదండ్రులు కావాలనుకొన్నారు. ఆదిశక్తిని పూజించడం ఆరంభించారు. ఆకాలంలోనే శూరపద్మాసురుడనే రాక్షసుడు సజ్జనులను బాధించేవాడు. శివకుమారునితో తప్ప మరణ భయంలేని ఆ శూరపద్మాసురుడు దేవతలను సైతం హింసించడం ఆరంభించాడు. దేవతలంతా కలసి పరమేశ్వరుడికి శివకుమారుణ్ణి ప్రసాదించమని వేడుకున్నారు. పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. కాలం గడుస్తున్నా శివకుమారోదయం కలుగలేదు. బాధలను భరించలేని దేవతలు ఆలోచనలు చేశారు.  పరమశివుని దగ్గరకు వెళ్లి శివరేతస్సును భరించే శక్తి ఒక్క పార్వతీదేవికి ఉందా అన్న అనుమానాన్ని వెలిబుచ్చారు. పార్వతి వారి అనుమానానికి కినుక వహించి అపుత్రవంతులుగా వారిని శపించింది. పరమేశ్వరుడు ఆలోచించి ‘దేవతలారా, మీ ఇష్టప్రకారమే నా రేతస్సు...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥త్రిజన్మపాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్‌..

💥చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది యుగం అంటే రెండు లేదా జంట అని అర్ధం. "ఉత్తరాయణం" "దక్షిణాయణం" అనబడే ”అయన” ద్వయమే యుగం. (పరోక్షంగా సంవత్సరం) యుగానికి ఆది కాబట్టి ”యుగాది” అయింది. కాల క్రమంలో ”ఉగాది”గా మారింది. బ్రహ్మ ఈ రోజునే సృష్టి మొత్తం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తులైనారని పెద్దలు చెబుతారు.  శాలివాహన శకానికి యుగకర్తగా నిలిచిన శాలివాహన చక్రవర్తి స్మృత్యర్థమే ఉగాది వచ్చింది అనేది చారిత్రక భావన. ఉగాది కాలానికి సంకేతం. 'కాల’లో, ‘కా’ అనగా శుభములను, ‘ల’ అనగా అందించునది అని అర్థం. ...

ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 నమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే | త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః | | నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే | శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే | | 💥పినాకపాణి, వృషధ్వజుడు, విశాలాక్షుడు, సదానందుడు, శ్మశానవాసి, శైలధన్వుడు, శశిశేఖరుడు, కపర్ది అంటూ ఎన్ని పేర్లు పిలిచినా అవన్నీ ఒక్క శంకరునికే చెల్లుతాయి. అటువంటి కైలాసవాసునకు వారు వీరను తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు.  శివపూజకు ఏ షరతుల్లేవు. అవధులూ లేవు. శివా అనని మనుష్యులు ఎవరూ ఉండరేమో అని అన్నా దోషం లేదేమో అనిపించేంతటి అందరినీ ఆకర్షించేంతటి ప్రేమాళువు శివుడు. 'శివ’ శబ్దంలో, ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘వ’కారము-అమృత స్వరూపిణి అయిన ‘శక్తి’. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము. శివుడు నిరాడంబరుడు. స్మశానం ఆయన నివాసం. నాగుపాము ఆయన ఆభరణం. కట్టుకునేవి చర్మాంబరాలు. ఆయన పూసు...

💥వసంత నవరాత్రుల ప్రాముఖ్యం..

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥వసంత నవరాత్రుల ప్రాముఖ్యం.. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి.. అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శిశిరంలో... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవ పల్లవాలతో చిగిర్చి., పూల సోయగాలతో కనువిందులు చేస్తూ., సుగంథాల  సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మునకు కూడా ఇష్టమే. అందుకే... 'హం ఋతునాం కుసుమాకరః అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.  అనంతమైన కాలంలో., కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత? ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే "#శ్రీరామావతారం" అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతూనే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘#వసంతనవరాత్రులు’ సం...

⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏 ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం | సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం | తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం | సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం || 💥మనలో భగవంతుడు లేడని అనేవారు ఉంటారు గానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశ బేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరిచే కీర్తింపపడేవాడు సూర్యుడు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి.  జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడే. నిస్వార్ధ కర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూ...

💥త్వమేవ శరణం మమ!

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥త్వమేవ శరణం మమ! సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ॥                                                     -భగవద్గీత. "భగవద్గీత"లోని ఈ శ్లోకానికి "#చరమశ్లోకము"అని పేరు. ఈ శ్లోకంలో... "శరణాగతుడైన జీవుడేమి చేయాలో " మొదటి చరణం తెల్పితే, రెండవ చరణంలో "భగవంతుడేమి చేస్తాడో" మనకు స్పష్టమవుతుంది.  "సర్వ ధర్మాల్ని త్యజించి నన్నాశ్రయింపుము. 'అహం’ అంటే నేను- భగవానుడను, సర్వజ్ఞుడను. సర్వశక్తుడను అయిన నేను- ‘త్వా’- నిన్ను, అకించనుడవై, అనన్య గతికుడవై నన్నే ఉపాయంగా నమ్మి వున్న నిన్ను- సమస్త పాపాలనుండి విముక్తుణ్ని చేయగలను" అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అర్జునుని శోకం మాన్పుటకు ఈ ‘చరమ శ్లోకాన్ని’ ఉపదేశించాడు. ఈ ఉపదేశం కేవలం అర్జునునికే కాదు, సమస్త మానవాళి కోసం శ్రీకృష్ణ పరమాత్మ అందించిన సందేశం. ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!! 💥భావం: సమస్త...

💥శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే... మూడు భువనాలను సృష్టించి, రక్షించి, సంహరించే పరమాత్మ శక్తినే "దుర్గ" లేదా "భువనేశ్వరీ" అని అంటారు. శుంభ, నిశుంభ అను రాక్షసులను సంహరించుటకు వచ్చిన దేవి ‘దుర్గ’  శుంభుడు అనగా కామము, నిశుంభుడు అనగా క్రోధము. శరీరం లోని ప్రతీ భాగము కదిలించే శక్తి ‘శుం’ అనే దానిని ఉత్తేజ పరిచేవాడు శుంభుడు. ఉద్వేగాన్నిచ్చేది క్రోధము దీనిని ఉత్తేజపరిచేవాడు ‘నిశుంభుడు’ శుంభ నిశుంభులు కూడా జగన్మాత సౌందర్యాన్ని చూసి మోహించారు. ఆమె మందలిస్తే కోపించిన వారివురిని సంహరించింది ‘దుర్గా’ దుర్గామాతకు వాహనం వ్యాఘ్రం. వ్యాఘ్రము అనగా విశేషంగా ఆఘ్రాణించేది. మనకు కోరికలు, క్రోధము అనేవి పూర్వజన్మ వాసనను బట్టి వస్తాయి. ఆ వాసనను అధిష్టించి జీవుల కామక్రోధాలను నియంత్రించి పరమాత్మ యందు భక్తిని, మోక్షము నందు ఆనందాన్ని కలిగించేది దుర్గ. నారాయణి, కాత్యాయని, శివ, చండీ, త్రయంబిక మొదలగు నామాలతో పూజింపబడే తల్లి దుర్గ. కామక్రోధాలను, అహంకారాలను అణిచి జ్ఞానాన్ని ప్రకాశింప చేసేది దుర్గ. 💥 శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥🙏 నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే...

💥🌷శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి🌷💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥🌷శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి🌷💥 శ్రీ వేంకటేశమహిషీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వేంకటేశమహిషీమహాలక్ష్మి చతుర్వింశతి నామభి: శ్రీ వేంకటేశమహిషీ మహాలక్ష్మిఅర్చనం కరిష్యే || అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః | అనుష్టప్ ఛందః శ్రీ మహాలక్ష్మీ దేవతాః | శ్రీ వేంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః | #ధ్యానం ఈశానం జగతో స్య వెంకట పతే ర్విష్టో: పరాం ప్రేయసీం తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్ కాంతి సంవర్ధినీమ్ | పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం || #లక్ష్మీ_చతుర్వింశతి (24) నామాలు 1) శ్రీ శ్రీయై నమః 2) శ్రీ లోక ధాత్రై నమః 3) శ్రీ బ్రహ్మమాత్రే నమః 4) శ్రీ పద్మనేత్రాయై నమః 5) శ్రీ పద్మముఖ్యై నమః 6) శ్రీ ప్రసన్నముఖ పద్మాయై నమః 7) శ్రీ పద్మకాంత్యై నమః 8) శ్రీ బిల్వ వనస్థాయై నమః 9) శ్రీ విష్ణుపత్న్యై నమః   10) శ్రీ విచిత్ర క్షేమ ధారిణ్యై నమః 11) శ్రీ పృధుస్రోణ్యై నమః 12) శ్రీ పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమః 13) శ్రీ సురక్త పద్మ పత్రాభ క...

🌹॥ శ్రీ రాఘవేంద్ర అష్టకం ॥🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🌹🙏 💥శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం. "మంత్రాలయం"లో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్త కోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు.  మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు... మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు "శ్రీరాయలు" భక్తులు రాఘవేంద్రస్వామిని "శ్రీరాయలు" అని పిలుచుకుంటారు. శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. స్వామి బృందావనం చేసిన "మంచాల" గ్రామం #మంత్రాలయం నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ "బృందావనం" నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు "మంత్రాలయం"లోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి, సంతృప్తి మాటలకందనివి.  అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది న...

⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏 భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా! అవిరళ కేశవ ప్రహ్లాద వరదా! పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా! భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా!! 💥ఆర్తితో హరిని పిలిచాడు ప్రహ్లాదుడు. నమ్మకంతో ‘స్వామి ఇక్కడే.. ఈ స్తంభంలోనే ఉన్నాడ’ని చెప్పాడు. మరుక్షణం స్తంభంలో నారసింహుడిగా వెలిశాడు శ్రీమన్నారాయణుడు. హిరణ్యకశిపుని సంహరించాడు.  ఉగ్రమూర్తి కాసేపటికి చల్లబడ్డాడు. ప్రహ్లాదుడిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. నిరంతరం శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తూ, జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు. ఓ రోజు పూజా మందిరంలో శ్రీహరి ధ్యానంలో ఉన్నాడు ప్రహ్లాదుడు. అకస్మాత్తుగా ప్రతక్ష్యమయ్యాడు హరి. ‘నాయనా! నీకేం వరం కావాలో కోరుకో’ అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం కోరినా స్వామి చిటికెలో ఇచ్చేవాడే. ఆ భక్తాగ్రేసరుడు ఆలోచనలో పడ్డాడు. ఏం అడగాలా అని తటపటాయించాడు. అంతలోనే ‘ఇచ్చేవాడు ఆయన, తీసుకునేది నేను.. నాకు ఏది యోగ్యమో, ఏది అవసరమో స్వామికి తెలియకుండా ఉంటుందా!’ అనుకున్నాడు. ‘స్వామీ! అన్ని వరాలలో ఉత్తమమైనది నాకు అనుగ్రహించు’ అని ప్రార్థించాడు. అప్పుడు నారాయణుడు ‘ప్రహ్లాదా! ఆ...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ! నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా!! 💥వక్రం అనగా విఘ్నము... లౌకిక జీవనంలో అటంకాలుగా చెప్పుకుంటే, ఆధ్యాత్మికతలో విఘ్నమే మాయ. గణేశునికి "విఘ్నరాజు" అనే నామం ఉంది. అలాగే "విఘ్నకర్త", "విఘ్నహర్త" అనే నామాలు కూడా ఉన్నాయి.  విఘ్నరాజు అనగా విఘ్నములను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, అనగా మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆయనే పరబ్రహ్మం. ఈ జగత్తు ఆయన మాయ. ఈ మాయ కూడా ఆయనలోనించే వచ్చింది... జీవుల కర్మ తీరటం కోసం వారికి ఉపాధి (శరీరం) కల్పించి, మాయలో ఉంచి, కర్మక్షయం చేస్తున్నాడు. తనను చేరటానికి కర్మ క్షయం చేస్తున్న గణేశుని ఒక నామమే విఘ్నకర్త. తన పాదాలను గట్టిగా పట్టుకుని, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు, నీకే శరణాగతి చేస్తున్నాను, నన్ను ఉద్ధరించు అన్న భక్తునికి మాయను తొలగించి, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు కనుక ఆయన విఘ్నహర్త కూడా.  లౌకిక జీవనంలో వీటి అర్ధాలు మనకు తేలికగానే బోధపడతాయి. 💥కాబట్టి గణపతిని "వక్రతుండ" అనే నామంతో పూజిస్తే, ఆయన మనకున్న భౌతిక, ఆధ్యాత్మిక విఘ్నాలను తొలగించి, ఆయనలో కలు...

💥నిత్య పూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 💥నిత్య పూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?💥 అన్నింటికన్నా పతాక స్థాయి మోక్షం.. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు.  మోక్షం ఇవ్వగలిగిన రూపాలు ఏవి అన్నవాటిని శంకర భగవత్పాదాచార్యులు (షణ్మతస్థాపనాచార్య) ఆరింటిని  నిర్ధారణ చేశారు.  1) పరమశివుడు 2) అంబిక (అమ్మవారు) 3) సూర్యుడు 4) విష్ణువు 5) సుబ్రహ్మణ్యుడు 6) విఘ్నేశ్వరుడు. ఈ ఆరుగురి పేర్లమీదే శైవము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, కౌమారం, గాణాపత్యము అని ఆరు సిద్ధాంతాలు. ఇందులో అయిదుగురికి పూజలో స్థానం ఇచ్చారు.  "పంచాయతనం" అంటే అయిదు. పరమశివుడు, అమ్మవారు, శ్రీమహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు పంచాయతనంలో ఉంటారు. మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం? 💥సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతి స్వరూపుడు. ఆయన ఎక్కడ ఉంటే "అజ్ఞాన దగ్ధం"... అజ్ఞానాన్ని తీసేస్తాడు. సుబ్రహ్మణ్యుడు అంటే ఎప్పుడూ జ్ఞానమూర్తి. జ్యోతి స్వరూపంగా వెలిగిపోతూంటాడు.  పూజ మొట్టమొదటగా దీపం వెలిగించి మొ...

కోరిన కోర్కెలు తీర్చే అత్యంత మంత్ర శక్తి కలిగిన ఆంజనేయ స్వామి దండకం..

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥హనుమ నామస్మరణం... సర్వపాప నివారణం💥 కోరిన కోర్కెలు తీర్చే అత్యంత మంత్ర శక్తి కలిగిన ఆంజనేయ స్వామి దండకం.. ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ దండకంలో ఉన్నాయి. మంత్రశక్తి కలిగిన ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన వారికి కోరిన కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. 💥🌹శ్రీ ఆంజనేయ దండకం🌹💥 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి, నీ దాస దాసుండనై, రామ భక్తుండనై, నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి, స్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి,...

💥పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు?

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥పరమ శివుడు సర్వాంతర్యామి గదా, మరి ఆయనకు నంది వాహనమెందుకు? పరమాత్మ తత్త్వానికి లింగము ఎలా చిహ్నమో, జీవ తత్త్వానికి నంది చిహ్నము. పశుత్వముతో కూడిన జీవ తత్త్వము ప్రకృతి వైపున తన దృష్టిని తిప్పక, ఈశ్వరుని వైపు త్రిప్పటం చేత భగవంతునితో సన్నిహిత సంబంధాన్ని పొందింది, నంది.  నందికి ఈశ్వరునికి మధ్యలో, ఎవరూ అడ్డు తగల కూడదు. నంది ధర్మానికి ప్రతీక. నంది శృంగముల మధ్య నుండి ఈశ్వర లింగాన్ని దర్శించాలని చెప్తారు.  పశుత్వము నుండి ధర్మాన్ని ఆచరిస్తూ దైవత్వాన్ని చింతించటం ద్వారా, నంది ఈశ్వరునిగా మారి, నందీశ్వరుడుగా ఏకమవుతాడు. పశుతత్త్వాన్ని విసర్జించి దృష్టిని ఈశ్వరుని వైపు మరల్చి ధర్మ మార్గంలో నడవటం చేతనే నంది, నందీశ్వరుడుగా మారిపోయాడు. 💥నాలుగు పురుషార్థాలలో, అర్థ కామాల్ని ధర్మంతో అనుభవించాలని.. అప్పుడు మనిషి, పశుత్వం నుంచి విముక్తుడై, పశుపతి తత్త్వాన్ని అందుకోగలడని.. పాశుపతమైన ఈ దీక్ష ఉంటే, పశుపతి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని.. తనలో ఉండే పశు రాక్షస గుణాల్ని అణచుకొని మానవత్వాన్ని పెంపొందించుకుంటూ, మొలకెత్తుతున్న అంతర్లీన దైవ తత్త్వాన్ని ప్రజ్వలింప చేసుకుంటూ.....

💥 ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం.. సూర్యభగవానుడు

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏 💥 ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం.. సూర్యభగవానుడు వేదములు కీర్తించుచున్న పరమాత్మ సూర్యుడే. పురాణములు పేర్కొన్న అంతరాత్మ సూర్యుడే. ప్రత్యక్షముగా దర్శనమిచ్చు దేవత ఆదిత్యుడైన సూర్య భగవానుడు. ఆదిత్యుడు సర్వమునే వీక్షించుచున్నాడు.  ఈ జగత్తున సృష్టి స్థితి లయములు ఆయన వలననే జరుగుచున్నవి. సర్వభూతములకు అతడే హేతువు.  కృతయుగము నుండి సూర్యుడే కాల స్వరూపము. ఇంద్రాది దేవతలు అతని రూపములే. సర్వ జీవ దేహముల యొక్క నిర్మాత, ప్రేరకుడు సూర్యభగవానుడు. సూర్యమండల స్థితుడైన ఇతనిని జపించిన వారికి సర్వసిద్ధులు లభిస్తాయి. ఎవరైతే ఆదివారం సూర్యుని ఆరాధిస్తారో వారికి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక దు:ఖములు దరిచేరవు. సూర్యోపాసన చేసినవారికి గ్రహశాంతి అవసరము లేదు. అంత ప్రముఖమైనది సూర్యారాధన. ఆదిత్యునకు అర్హ్యతర్పణములు అత్యంత ప్రీతికరములు. అందువలన సూర్యారాధన విశిష్టమైనది. సూర్యారాధనలో అంశలను పన్నెండుగా గుర్తించారు. పన్నెండు నామములతో ఆయనను ఆరాధన చేయడం ఒక సనాతన రహస్యం. ధాతీ, ఆర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పూషా, పర్జన్య, అంశుమాన్, భగ, తష్ట్వా. విష్ణు. ఇవి ద్వాదశా...

మోక్షం ప్రసాదించే "గజేంద్రమోక్షం" ఒక్కసారి వింటే చాలు

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మోక్షం ప్రసాదించే "గజేంద్రమోక్షం"  ఒక్కసారి వింటే చాలు... ఎవరు అయితే ఈ "గజేంద్ర మోక్షం" కథని శ్రద్దగా వింటారో పాపాలు పరిహరించబడతాయి. ఐశ్వర్యం కలసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. 🌹గజరాజు: ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు, అతడు అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది  ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రం జపం చేస్తుండగా, అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్ర జపం చేస్తు మహర్షి వచ్చినా లేవక పోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని యందు జన్మించెదవు అని శపించాడు. ఐతే మహాపురుషులు ఏనాడు అయితే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అనడంతో... ఆలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేసాడు. 🌹మొసలి: ఒక గంధర్వుడు ఒక రోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగ అతడిని అపహాస్యం చే...