Posts

Showing posts from January, 2026

మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి హిందూ సాంప్రదాయంలో మాఘ పౌర్ణమి (మాఘ పూర్ణిమ) అత్యంత పవిత్రమైన రోజుగా గుర్తింపు పొందింది. దీనిని "మహామాఘి" అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ఉండగా, నది లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, విష్ణు–శివ అనుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం మొత్తం పవిత్రమైనదే అయినా, పౌర్ణమి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని పండితుల అభిప్రాయం. మాఘమాసంలో, ముఖ్యంగా పౌర్ణమి రోజున పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా నశిస్తాయని పద్మ పురాణం పేర్కొంటుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడు గంగానదిలో నివసిస్తాడని విశ్వాసం ఉంది. అలాగే దేవతలు భూమికి వచ్చి గంగానదిలో స్నానం చేస్తారని పురాణ గాథలు చెబుతాయి. అందుకే ఈ రోజున చేసే స్నానం, పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్మకం. హిందూ ధర్మంలో “నదీనాం సాగరో గతి” అనే భావన ఉంది. అన్ని పవిత్ర నదులూ చివరకు సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి, సముద్ర స్నానం చేయడం వల్ల సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్...

మాఘపురాణం - 14వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹 🙏 💥 మాఘపురాణం - 14వ అధ్యాయము బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఓ దిలీపుమహారాజా ! మాఘమాసములో స్నానము ఆచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా! ఒక విప్రకన్య తన భర్తతో విష్ణు సాయుజ్యమును ఎలా పొందినదో వివరిస్తాను సావధానుడవై విను. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. బుద్ధియందు పేరుకు తగినట్టుగా పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు అవుటచేత అనేకమంది అతనివద్ద శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు సుశీలని పేరు కల బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి కన్నులు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు, అందమైన ముఖవర్చస్సుతో, హంస నడకను మరిపించు నడక, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుసతో ఉన్న ఆమెను చూసిన వారికి మరల మరల చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి ప...

💥అన్నమాచార్య సంకీర్తన💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥 అన్నమాచార్య సంకీర్తన 💥 💥 అయమేవ అయమేవ ఆదిపురుషో అయమేవ అయమేవ ఆదిపురుషో జయకరం తమహం శరణం భజామి అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో- ప్యయమేవ వటదళాగ్రాధీశయన: అయమేవ దశవిధైరవతార రూపశ్చ నయమార్గ భువిరక్షణం కరోతి అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు అయమేవ దుష్టదైత్యాంత కస్తు అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే అయమేవ వరదోప్యాచకానాం అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో అయమేవ వైకుంఠాధీశ్వరస్తు 💥ముఖ్యపదాల అర్ధం: అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే ఆదిపురుషో: ఆదిపురుష: = ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు) జయకరం: జయములు కలిగించువానిని తమహం: తం= నిన్ను +అహం= నేను శరణం: రక్షణ కోసం భజామి: సేవింపుచున్నాను అయమేవ ఖలు: ఈతడే కదా (ఖలు = కదా) పురా: పూర్వము అవనీధరస్తుసోప్యయమేవ: = అవనీధరస్తు+స:+అపి+అయమేవ = భూమిని ధరించినవాడు అయ్యెను + అతడు + కూడా+ ఈతడే వటదళాగ్రాధీశయన: = వటదళ+అగ్ర+అధిశయన: = పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు.    అయమేవ: ఈతడే దశవిధై: : పది రకాల అవతార రూపశ్చ = అవతార రూప: + చ : అవతార రూపుడు + మరియు నయమార్గ: న్యాయ మార్గము నంద...

మాఘపురాణం - 13వ అధ్యాయం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 13వ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలముతో దిలీపుడు - “మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినాలి అన్న కోరిక కలుగుతున్నది. ఇంకా చెప్పవలసినద” ని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. పూర్వము పార్వతీదేవికి శివుడు, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్యము గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ప్రమథగణములు సేవిస్తు ఉండగా , నానారత్న విభూషితమైన కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి “స్వామీ! మీవలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను. ప్రయాగ క్షేత్ర మహాత్యమును, మాఘమాస మహాత్యమును వినవలెనని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాన” ని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో - దేవీ! నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు ఉండగా మాఘమా...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 శ్రీ మహాలక్ష్మీ సిరులతల్లి, విష్ణుపట్టపురాణి. ఈ లోకంలో అందరూ లక్ష్మీకటాక్షం కోసం చేయని పూజ ఉండదు. లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణించాక ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా...

💥 మాఘపురాణం - 12వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 12వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. నాకు మరొక సంశయం కలిగింది. మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వమని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు - దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించు. మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడేడు జన్మలలోని పాపములు నశించిపోతాయి. మాఘమాసంలో నదీస్నానంతోపాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కలుగుటయే గాక మళ్ళీ జన్మ అనేది కలుగదు. పడమటి కనుమల దగ్గర త్ర్...

💥భీష్మఏకాదశి, శ్రీవిష్ణుసహస్రనామజయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 భీష్మఏకాదశి శ్రీవిష్ణుసహస్రనామజయంతి మాఘ శుక్ల ఏకాదశినే "భీష్మ ఏకాదశి" అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకళింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహ...

💥మాఘపురాణం -11వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 💥మాఘపురాణం -11వ అధ్యాయము మార్కండేయుని వృత్తాంతము వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి – మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుమని వశిష్ఠుల వారు చెప్పసాగారు. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతున్నది. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసి ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభము చేసారు. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందాడు.తల్లి తండ్రులు “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుతున్నావు. అందులకు మేము చాలా సంతోషము పొందుతున్నాము. గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరములు. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పారు. పదిహేను...

💥శ్రీనరసింహ అష్టకం: (నృసింహాష్టకం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీనృసింహ స్వామినే నమః 🌹🙏 💥 శ్రీనరసింహ అష్టకం: (నృసింహాష్టకం) హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించిన ఉగ్ర నరసింహ స్వామిని స్తుతించే ఎనిమిది శ్లోకాల భక్తిరస కావ్యం. ఇది స్వామివారి దివ్యరూపం, కరుణ మరియు శత్రు నాశన శక్తిని వర్ణిస్తూ, పాపాలను తొలగించి, భక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. ఈ అష్టకాన్ని పఠించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని నమ్ముతారు.  శ్రీ నరసింహ అష్టకం - సారాంశం (తెలుగులో): 1. శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి... - కోటి చంద్రుల కాంతితో ప్రకాశించే, నిర్మలమైన, లక్ష్మీదేవితో కూడిన, దైత్యులను (రాక్షసులను) సంహరించే నరసింహ స్వామి! సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను కాపాడు. 2. పాదకమలావనత పాతకి-జనానాం... - పాదాలకు నమస్కరించే భక్తుల పాపాలను అగ్నిలా కాల్చివేసే, పక్షిరాజు (గరుత్మంతుడు) వాహనంగా కల, భక్తార్తి హరుడైన నరసింహ స్వామి! నన్ను రక్షించు. 3. మల్లికాక్ష మధువైరి... - మల్లికాక్ష (విష్ణువు), మధువైరి (మధువు అనే రాక్షసుడిని చంపినవాడు), సర్వ వ్యాపకుడు, హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చిన గోళ్లు కలవాడా! నన్ను రక్షించు. 4. నరహరి! - నర-సింహ రూపుడా! ఉగ్...

💥మాఘపురాణం -10వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మాఘపురాణం -10వ అధ్యాయము మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు మాఘపురాణము గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణయందు ఆసక్తి గలవాడు అయ్యాడు. . అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసారు. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను. కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసారు. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లే మా ఇద్...

ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం! షణ్ముఖనాథా! సుబ్రహ్మణ్యం ! సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు. పూర్వం స్వాయంభువమనువునకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావము నందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు చేయ పూనుకునెను. ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా, ప్రియవ్రతుడు.. ”ఈ జీవితము అశాశ్వతము, భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము, జీవితము క్షణభంగురము, నేను రాజ్యము చేయకోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను” అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు, “ఓ రాజా! నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు చేయుట వలన ఎట్టి లాభమూ లేదు. కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చేయుము” అని చెప్తారు. బ్రహ్మౌపదేశము మీద, ప్రియవ్రతుడు తపస్సుని విరమించి, మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను. పుత...

💥మాఘపురాణం -9వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మాఘపురాణం -9వ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈవిధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవుతులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా విని తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారిని – “పూజ్యులైన ఓ మహర్షీ! ఈ భూలోకమునకు, యమలోకమునకు దూరమెంత?” చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలములో వెళ్ళి వచ్చినవి?” అని ప్రశ్నించాడు. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి “మాహారాజా! అందరు తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలూ పుణ్యవతులు. వారొకసారి మాఘమాసములో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుక గలిగినారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును ఆలకించు. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను. ఆ వృత్తాంతం కడు చిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు. సకల జీవులయందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందునూ, నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడువకుండ చేయు దీక్షావ...

భీష్మాష్టమి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 భీష్మాష్టమి రధ సప్తమి తరువాత వచ్చే రోజునే "భీష్మ అష్టమి" గా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణ గా విడువమని చెప్పింది శాస్త్రం. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్. తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం.. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః! ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!! వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ! అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!! వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!! 💥శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని.. శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ”తను ఒక పెద్ద ఆయనను తల్చుకుంటున్నాను అని…..” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్...

💥మాఘపురాణం - 8వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మాఘపురాణం - 8వ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి లేచినట్లుగా లేచి, వారు యమలోకమందు చూచిన వింతలు, విశేషములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు. యమలోకములో జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను ఆనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపినీ ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. ఆ కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకండి. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి, పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుటవలన అంతకుముందు చేసిన పాపములు పటాపంచలై నశ...

💥మాఘపురాణం - ఏడవ అధ్యాయం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మాఘపురాణం - ఏడవ అధ్యాయం మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా! నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టం నెరవేర్చెదను” అని పలికాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయమ’ ని ప్రార్థించాడు. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనెంచి “మ...

💥మాఘ శుద్ధ సప్తమి.. రథసప్తమి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 💥 మాఘ శుద్ధ సప్తమి.. రథసప్తమి. చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్మకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అదితి, కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా, ‘సూర్య జయంతి’గా జరుపుకుంటారు. దానినే ‘రథ సప్తమి’ అంటారు. సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. ‘భాసం’ అంటే ప్రకాశం. ‘కరుడు’ చేసేవాడు ‘భాస్కరుడు’ అంటే ‘జగత్తును ప్రకాశవంతం చేసేవాడు’ అని అర్థం. సూర్యభగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగానూ, రాత్రివేళలో నిద్రాసక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగఛ్ఛక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చే వానిగా భావించింది. సూర్య మండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అంతశ్చేతనలోని అజ్ఞ...

💥 తిరుమలలో రథసప్తమి🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥 తిరుమలలో రథసప్తమి🌹🙏 సకల జీవకోటికి వెలుగు ప్రదాత.. చైతన్య కారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు.. ఆ ఆదిత్యుని జన్మదినమైన సూర్యజయంతి రోజున రథసప్తమి వేడుకలను టీటీడీ నిర్వహించడం ఆనవాయితి. సూర్యోదయాన సుర్యప్రభ వాహనంతో ప్రారంభమైన గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగియనున్నది. శ్రీనివాసుడు ఒక్క రోజే సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల,చంద్రప్రభ వాహనాలపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు. ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 9 రోజులలో శ్రీవారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తే… రథ సమప్తమి పర్వదినం రోజున ఒక్కే రోజు శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు. స్వామివారు తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, ఉదయం 9 నుంచి 10 గంటల ...

💥మాఘపురాణం - 6వ అధ్యాయం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘపురాణం - 6వ అధ్యాయం సుశీల చరిత్ర భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరిణె వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్యపేరు సుశీల. మంచి శీలం గలది. మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండియూ దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచూ, యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై యుండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగ శృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీంకారం పెట్టుచు వచ్చి స్నానార్థమై వచ్చిన అ అముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కూ గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయి వున్నారు. ఆ వార్త మృగ శృంగునకు తెలియుటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృతదేహములనూ చూశాడు. ఎక్కడలేని ...