నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే..
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్
సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు.
అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు.
మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...
నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే..
య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్
-అనే మంత్రాన్ని ఉపదేశించారు.
ఇది శివపురాణంలో కూడా వస్తుంది.
ఇది చాలా గొప్ప మంత్రం.
నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.
నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.
1) నమశ్శివాయ:
(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం.
పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.
అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం..
న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.
పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.
2) సాంబాయ:
అమ్మతో ఉన్నవాడు.. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.
3) శాంతాయ:
ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం.
జీవితానికి కావలసింది కూడా శాంతమే.
"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే” అని ఉపనిషత్తు చెప్పింది.
అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.
4) పరమాత్మనే_నమః:
చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే. అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం.
ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు మహర్షే స్వయంగా చెప్పారు.
సేకరణ... 💐🙏

Comments
Post a Comment