🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷

 ⚜️🕉️🚩ఓం నమో గాయత్రీ దేవ్యై నమః🌹🙏


🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷


💥గాయత్రీ మంత్రము💥


"ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,

భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్"


ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే...


ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్


ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.


💥ఈ మంత్రములో "ఓం" అనేది “ప్రణవము”


“భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు"...

వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు.

ఇవి మూడు లోకాలను సూచిస్తాయి.


"తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

🔸🔹🔸🔹🔸🔹🔸


💥గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉన్నాయి.

వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.


💥కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు.

ఆ ప్రాకారంలో 24 స్తంభాలున్నాయి.

అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.


💥కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది.

ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి.


💥పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. 

ధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.


💥జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – 


💥24 కేశవ నామాలు...


💥24 తత్వాలు :

5 జ్ఞానేంద్రియాలు,

5 కర్మేంద్రియాలు, (5) పంచతన్మాత్రలు,

5 మహాద్భుతాలు,

బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు.


💥ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది.

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు:

"బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం"


💥రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి.

1, 1001, 2001, 3001, 4001,..... 23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది.

దీన్ని #గాయత్రిరామాయణం అని కూడా అంటారు.


💥ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి.

సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.


💥మన వెనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి.

వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.


💥న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు.


💥24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు.

సకల దోషాలు తొలగి పోతాయంటారు.


💥సకల దేవతా స్వరూపం గాయత్రీ.

రామాయణ సారం గాయత్రీ.

కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ.

విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.

సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ.

24 బీజాక్షర సంపుటి గాయత్రీ.


💥అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం