⚜️🚩ఒకే గర్భ గుడిలో వేంకటేశ్వరస్వామి రెండుగా దర్శనమిచ్చే ద్వారకా తిరుమల 🌹🙏

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


⚜️🚩ఒకే గర్భ గుడిలో వేంకటేశ్వరస్వామి రెండుగా దర్శనమిచ్చే  ద్వారకా తిరుమల 🌹🙏


🌹ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద "కలియుగ దైవం" శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.


🌹స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన "ద్వారక" అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి "ద్వారక తిరుమల" అని పేరు వచ్చింది.


🌹సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది.


🌹ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట.

కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు.

మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.


🌹"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది.

కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.


🌹ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము.

ఒక విగ్రహము సంపూర్ణమైనది.

రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము. 


🌹స్థల పురాణము ప్రకారము

ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు.


🌹"ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామి వారి పాద సేవను కోరాడు.

కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది.

పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. 


🌹విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించాలని భావించాడు.

దీంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు.


🌹స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ,


తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన "ధర్మార్ధకామ పురుషార్ధములు" సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.


🌹ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము.

ఎందుకంటే...

పుట్టలో స్వామివారు వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది.

పుట్టలో ఎర్ర చీమలు వుంటాయి.

అందుకే, విగ్రహానికి అభిషేకం చేయరు.


🌹ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యాణోత్సవాలు

వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు.

ఇందుకు కారణం- స్వయం భూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ,

సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.


🌹"భ్రమరాంబా మల్లేశ్వరస్వామి" ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు.


🌹మొత్తం కొండ "సర్పరాజు" "అనంతుని" ఆకారంలో ఉన్నదనీ,

తల పైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు.

అందువల్ల ఈ గుడిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

🌹సేకరణ




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు