హరిహరసుతనే శరణమయ్యప్ప
హరిహరసుతనే శరణమయ్యప్ప 🙏
🌹మాతా-పితా-గురు-దైవమే శరణమయ్యప్ప 🙏
🌹కన్నెస్వాములు🙏
🌹దత్తాత్రేయుడి భార్య లీలావతి... పతి శాపంతో మహిషాసురుడి సోదరి మహిషి గా జన్మించింది.
🌹ప్రజలను పట్టిపీడిస్తున్న మహిషాసురుని... లోకమాత సంహరించడంతో పతి శాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అదిష్ఠించింది.
🌹దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి, శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది.
🌹హరిహరసుతుడు అయ్యప్ప మహిషితో యుద్ధం మొదలుపెడతాడు.
పశువైన మహిషి ఛాతి మీదకెక్కి అయ్యప్ప నృత్యం చేస్తాడు.
ఈ నృత్యం చేసేది సాక్షాత్ హరిహర పుత్రుడేనని మహిషికి అర్దమై మణికంఠునికి సాష్టాంగ ప్రణామం చేసి మరణిస్తుంది.
🌹తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్పస్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది.
ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు.
🌹అయినా ఆమె పట్టువీడకపోవడంతో...
ఎప్పుడైతే నన్ను దర్శించడానికి కన్నెస్వామి రాడో అప్పుడు పెళ్ళి చేసుకుంటాను, అప్పటి వరకు బ్రహ్మచారిగానే ఉంటాను" అని చెప్తాడు
🌹వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని,
అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడతానని స్వామి మాట ఇస్తాడు.
🌹అంతేకాదు శబరి కొండల్లో నీవు #మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని తెలిపారు.
🌹మహిషి వధ చూసి మనసా, శిరసా నమస్కరించి పులిగా మారి అయ్యప్పకు వాహనంగా తనమీద కూర్చొపెట్టుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మహేంద్రుడు.
🌹అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములు అని అంటారు.
🌹కన్నెస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగనిదని పరమార్థం.
ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం.
ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నెస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో గుచ్చుతారు.
🌹ఏటా మాలికాపురత్తమ్మ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది.
🌹కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి.
అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి ఉండాలని కోరుకుంటారు.
🌹మొదటిసారి దీక్ష చేపట్టేవాళ్లు కన్నెస్వాములు, రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగవసారి గధాస్వామి, ఐదవసారి తెరు స్వామి, ఆరోసారి గురుస్వాములుగా పిలుస్తారు.
భూతనాథ సదానంద సర్వభూత దయాపర |
రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః
Comments
Post a Comment