గోదాదేవి🙏 (ఆండాళ్)
ఓం శ్రీ మాత్రే నమః 🙏
🌹గోదాదేవి🙏 (ఆండాళ్)
🌹 శ్రీమహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది.
🌹 శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు.
విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు.
నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది.
కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది.
🌹ఆయన అక్కడి ఆలయంలోని ప్రధాన దైవం అయిన శ్రీకృష్ణునికి నిత్యం పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు.
🌹ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది.
ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి... ఆమెకు #కోదై అని పేరు పెట్టి పెంచుకోసాగాడు.
🌹తమిళంలో కోదై అనగా "తులసి మాల" అని అర్థం.
తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు.
క్రమేపి ఆపేరే గోదా గామారింది.
🌹గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగింది.
యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది.
🌹తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది.
🌹అంతేకాదు... తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది.
🌹ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది.
తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు.
🌹కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
🌹దానితో విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ #ఆండాళ్ అని పిలవటం మొదలుపెట్టాడు.
ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం.
🌹 గోదా మనసులో తనకు పెళ్లంటూ జరిగితే స్వామితోనే జరగాలని అనుకుంది.
🌹అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన #కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది.
🌹గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా
తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు...
తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది.
🌹 ఆ "30 పాశురాలు" ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై.
🌹కృష్ణుడు విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు.
🌹శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు.
🌹పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.
🌹ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది.
అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.
Comments
Post a Comment